పుట:Parama yaugi vilaasamu (1928).pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము.

535


యాయాయిమూర్తుల ననువొంద నుతులు
సేయుచు వెండియుఁ జీఁకటిపడిన
మునుబోలె పుత్తడి ముదిరూపు వేగఁ
గొనిపోవుచును దవ్వుగొని యేగుదెంచి
ఘనతరం బైన సంగమపురంబునకుఁ
జని ప్రొద్దుగ్రుంకెడిసమయంబునందు
నాపురవరనాథుఁ డై యొప్పుచున్న
శ్రీపతి యారగించినప్రసాదంబు
ననుచరసంయుతుం డై యారగించి
ననయంబు గార్క్రమ్ము నయ్యూరిత్రోవఁ
దెలియక యాయూరితీర్పరిం గూర్మిఁ
బిలిపించి త్రోవఁ దెల్పడువాని నొకని
ననుపుము సూర్యోదయం బైనదనక
ననిన వాఁ డారీతి ననిపెద ననుచు
నరిగి మదోన్మత్తుఁ డై మఱచుటయు
నరిదండధరుఁ డంత నచ్చోటఁ గదలి
చనుచుండఁ దత్పురీశ్వరుఁ డైనయట్టి
వనజోదరుఁడు భక్తవత్సలుఁ డపుడు
బాణకృపాణచాపంబులు నుభయ
తూణీరములుఁ దాల్చి తోడనే నడువఁ