పుట:Parama yaugi vilaasamu (1928).pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

484

పరమయోగివిలాసము.


నజుతండ్రి భక్తసాహస్రంబు మున్ను
భుజియింప కటమున్ను భుజియింపమెపుడు
విష్ణుండు సాక్షిగా వెలయ నేఁ జేయు
వైష్ణవార్చన విడువఁగరానివ్రతము
వీరికిఁగా ధరావిభునిఁ గ్రమ్మఱను
జేరి కొల్చెద నన్నఁ జేపట్ట డతఁడు
చేపట్టి యతఁడట్లసేసినఁ దుదిని
భూపాలునర్థ మీపోఁడిమి నొసఁగ
హరిభక్తులకు నది యర్హంబు గాదు
హరినీలవేణి యెట్లంటేని వినుము
తుది రాజవిత్త మెందులకంటె దోష
మొదవించు ననుచు మున్నొగి సప్తమునులు
ననుపమక్షామంబునందుఁ బీనుంగుఁ
దినఁగోరి యది రాజు తెలిసి కాఁపిడిన
జడిసి వా రదియు రాజద్రవ్య మనుచు
విడిచి రాగమములు వివరించునట్లు
కావున నెన్నిసంగతుల వైష్ణవుల
కావిత్త మొసఁగుట యర్హంబు గాదు
తనుగూర్చి చేయు నధర్మంబు ధర్మ
మనికాదె మున్ను శ్రీహరి యానతిచ్చె