పుట:Parama yaugi vilaasamu (1928).pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

475


మతిఁ దలంచిన మదోన్మత్తులౌ భూమి
పతులకు సత్య మెప్పట్టునం గలదె?
వివరింపఁగా భూమివిభులలోపలను
[1]చెవి బేద బిసిడి దుశ్శీలవర్తనుని
దుష్టు జూదరి ధనాతురు నవివేకిఁ
గష్టు వైష్ణవనిందఁ గావించువానిఁ
గన్నమాత్రనె దినకరు విలోకించి
వెన్నునినామంబు వినుతింపలయు
నిన్నియు నెఱిఁగి నే నీదురాచారి
యున్న చక్కటికి రా నుచితమే యనుచు
సారసోదరభక్త సాహస్రమునకు
నారగింపంగఁ జేయఁగ లేనికతన
నుపవాసనియతుఁడై యుండె నుండటయుఁ
గృపతోడ శ్రీహస్తిగిరిభూవరుండు
చనుదెంచి యారేయి స్వప్నంబునందుఁ,
దనఁదివ్యకరములఁ దను వొయ్య నివిరి
వలమురి యమృతంబు వారిచేసేత
జలజాతయుగళిమైఁ జల్లగాఁ దుడిచి
తనకటాక్షామృతధారలచేతఁ
దనివినొందించి యాదటముండ నేలఁ

  1. చెవిఁ బెద