పుట:Parama yaugi vilaasamu (1928).pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[28]

పంచమాశ్వాసము.

433



నక్షతులైన యయ్యాదిదంపతుల
కక్షతంబులు వెట్టి రాగమోక్తముగ
హరియాజ్ఞ నవనిధు లట కేగుదెంచి
కర మర్థితో నూడిగంబులు సలుప
శ్రీరంగనాథునిసేనావిభుండు
కారినందనుఁడాదిగాఁ గలవారిఁ
గమలసంభవుఁ డాదిగాఁ గలవారి
బ్రమదంబుతోడ సంభావించె నపుడు
వల్లభదేవుండు వరుసతో భూమి
వల్లభులను గారవమునఁ గావించె
నీవిధి రంగమహీనాయకుండు
విమై నలవధూటిని వరియించి
మోదించి కాసారముఖ్యయోగులకు
గోదనెచ్చెలులకుం గురుకాధిపతికి
వలయువారికి నిష్టవరముల నొసఁగి
యలరుచు నుండి నాలవనాఁటిరాత్రి
యురగతల్పమున నయ్యుడురాజనదనఁ
దిరమొంద మరుకేళిఁ దేలిచి తేలి
యోగనిద్రాసక్తి నుండఁ బూర్వాద్రి
జేగురునెరసినచెలువు దీపింపఁ