పుట:Parama yaugi vilaasamu (1928).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

347


దనసకలోత్పత్తి ధవళాక్షుఁ డొసఁగు
కనకపాత్రంబునం గైకొనివచ్చి
శ్రీరంగవిభుని కర్పించి తత్పాద
నీరజభావననిరతయై యుండెఁ
బరమపావన మైన భక్తాంఘ్రిరేణు
చరితంబు భక్తి నిచ్చలు నెన్వరేని
వినిన వ్రాసినఁ జదివినను వాక్రుచ్చి
నను వారి కెపుడు వైష్ణవులసత్కృపయు
హరికృపామృతము. ననంతమై పొంగి
పరిపూర్ణమై యుండుఁ బ్రతిలేక యనుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
యతిలోకమతికి శేషాచలరాజ
పతికి సర్వోముఖ్యభక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళ[1]పాకాన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మ మండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ


  1. పాకన్నయార్య