ఈ పుట ఆమోదించబడ్డది
334
పరమయోగివిలాసము.
యనువారు కొందఱు నటఁ దోఁచినట్ల
యనువారు నైయుండి రప్పుడు భటులు
వారిఁ దోకొనిపోయి వనజాక్షుగిన్నె
యారయరాదాయె నని [1]యాత్మలోన
నందంద చింతించు నయ్యధికారి
ముందర నిడి కేలుమొగిచిన నతఁడు
గాసించి వీరి నిక్కడ నాకునేన
చేసేతఁ బట్టి శిక్షించితినేని
ఈజాడ తన కేల యెఱిఁగింప వనుచు
రాజు విన్నను నపరాధంబు వచ్చు
నని వారివారిచే నగపడినట్టి
కనకపాత్రంబు దిగ్గనఁ గొనిపోయి
రుచిరసింహాసనారూఢుఁ డైయున్న
నిచుళేంద్రుఁ డగుచోళనృపతిముందరను
ఇరువుర నిడి మ్రొక్కి యీకార్య మెల్ల
నిరవొంద నెఱిఁగించె నెఱిఁగించుటయును
విని భూవరుండు సవిస్మయుం డగుచుఁ
గనలి వారలదెసఁ గాంచి యిట్లనియె
నారంగపతికి ద్రోహముసేసినపుడు
చేరివీరల నాజ్ఞసేయుటే తగవ
- ↑ యాత్రపడుచు