పుట:Parama yaugi vilaasamu (1928).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

99


యితనిచే లోకంబు లీడేరు ననుచు
మతి విచారించి యమ్మౌని శేఖరుఁడు
సరస నొప్పెడి హేమసారకీర్ణ
సరసి యందులఁ గృతస్నానుఁ గావించి
పొంకంబుగాఁ దనపూర్వాంకపీఠిఁ
బంకజాతాసనభాసితుం జేసి
పరమగురుం డైనపద్మేశుహృదయ
సరసిజాంతరసీమఁ జక్కఁగా నిలిపి
కరము వేడుక మస్తకముమీఁద తనదు
కర మూఁది దక్షిణకర్ణంబులోన
స్వరవర్ణ చరణార్థ జూతాదివిధుల
సరణు లేర్పడఁగ నిశ్చలదయాదృష్టి
సరవిమై కృతపురశ్చరణంబు మంత్ర
వరము యోగమును సర్వముఁ దేటపడఁగ
నుపదేశ మొసఁగి సర్వోన్నతు గాఁగఁ
గృపచేసె నక్కణికృష్ణు వర్ధిష్ణుఁ
దను నంటుకొనువారు తనయంతవారి
లనుమాట జగతిఁ దథ్యము చేసె నతఁడు
కృతకృత్యుఁ డగు కణికృష్ణుఁ డామౌని
పతిపదాబ్జములకు భక్తిమై వ్రాలి