పుట:PandugaluParamardhalu.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దగ్గర శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవాలయము కలదు. ఇయ్యవి రెండున్ కాని, వీనిలో నొకటి కాని క్షేత్ర పాలకదైవతములయి యుండవలయును, విష్ణుక్షేత్రముల యందు శివుడు క్షెత్ర పాలకుడయి యుండుటయు, శివుడు క్షేత్రస్వామియై యుండుచోట్ల విష్ణువు క్షేత్రపాలకుడయి యుండు టయు అనుశ్రుతముగా వచ్చుచున్న ఆచారము. ఈ సింహాచలస్వామికి కొండ రెండవ ప్రక్కనున్న మాదవస్వామి క్షేత్రపాలకుడని కొందఱందుదు.

   (5) ఇంతేకాదు, కొండదిగువను రెండుమైళ్ల దూరములో కాలభైరవుడు క్షేత్రమునకు కావలిగానున్నాడ్.  ఇయ్యది శైవ సాంప్రదాయము కాని వైష్ణవ సాంప్రదాయము కాదు.
  (6) మొదట లింగాకారమునున్న విగ్రహముని కళా కౌశల్యము లేనియే అకృతాస్త్రుని చేతనో తొందరగానో, రహస్యముగానో ఇప్పటివరాహ లక్ష్మీనరసింహా కారముగా మార్చించినరియు ధైర్యము చాలకయో మరియే కారణము చేతనో నాతి లింగాకారమును నేటివరకును గంధపు బూతవలన సంరక్షించు చున్నారనియు కొందఱు శైవమత పక్షపాతులు చెప్పుదురు-విశాఖపత్రిక 

(7) శైవసంబంధముండిన కాలములో నేర్పడిన గొప్పయాచారమును నిచట యిప్పటికి నిలిచియున్నది. ఆక్షేత్రమునకు ప్రసిద్ధమగు 'చందన సేవ ' అను గొప్ప యుత్సవము నాతికి నేటికిని యక్షయ తృతీయ నాడెజరుగుచు'న్నదన్నది. ఈపాతవాడుక పోద్రోలనలవికాదు. -'సుభోదిని

                      పుట్టధార.
     ఆంధ్రుని ప్రాచీన క్షేత్రాలలో సింహాచలం ఒకటి.  దీనికి సింహాచలం అనే పేరు ఈ కొండ సింహం రూపంలో ఉండడం చేతనని కొందరు. నరసింహస్వామి క్షెత్రమగుచేతనని కొందరు అంటార్.  ఎనిమిది వందల అడుగుల ఎత్తుగల కొండ వేసవిలో కూడ చల్లగ ఉండును.  నీటిధారలు పెక్కు, హనుమద్దార, ఆకాశధార, పంచపాండవులధార మున్నకు ధారలు ఈ కొండమీద అనేకం.  వీటి ఆధారమైన దారపుట్టధార.
      కొండమీద ఎక్కడానికి రెండు మెట్ల దారులు, మాదవధారదారి, అడవి వరము దాని అని, అందులో రెండవది.  ఎక్కువసదుపాయమైనది.  ఈ దారిలో 1120 మెట్లు ఉన్నాయి.  పనితనము గల ప్రతిమలు, చెక్కడపు జిలుగులు, బాగా ఉన్నాయి.