పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
247

సరస భవద్వచోమృత వశంబునఁ జొక్కిన నాముఖంబునన్
బరవదు వాణి దాఁదెరలి భక్తియె గైకొనుమయ్య ధీమణీ.

పచ్చెయప్ప హైస్కూల్ సంస్కృతాంధ్రోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ పర్ణశాల నృసింహాచార్యులవారు

విజయేతాం కవివర్యౌ కొప్పర వంశాబ్ది కౌస్తుభాబ్జౌ తౌ
యత్కవితా మధురిమ్ణా సంతుష్టాస్మోవయం నిరతాం.

శ్రీమత్కొప్పర వంశ మౌక్తికమణి శ్రీసుబ్బరాయాహ్వయ
స్తస్య శ్రీరమణోనుజశ్చ జయతాం సారస్వతజ్ఞోత్తమౌ
యౌ రామస్య సుతా వివాశుకవితా చాతుర్యలోకో స్వయం
జాతౌ సర్వజనైస్సదా భువినుతౌ సంభావితౌ సాదరం.

పర్ణశాలేన కౌండిన్య నరసింహేన సాదరం
కవితా మాధురీ సార పరితు ష్టేన సన్నుతౌ

తండియార్‌పేట హైస్కూల్ సంస్కృతాంధ్రోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ బి.వేంకటరామానుజాచార్యులవారు

సరసపువాక్చమత్కృతుల సర్వజనంబుల కాదరంబుగా
స్థిరతరబుద్ధితోఁ జెలఁగిచేసెడు నీదు శతావధానమం
దరుదుగ మర్త్యలోకముననాడెడు భారతియో యటంచు నే
వెరవుగఁజూచినాఁడ సుమి వేంకటసుబ్బ కవీంద్ర శేఖరా

ముత్యాలపేట హైస్కూలుకవి పండితోపాధ్యాయులగు మ.రా.రా. పోకల వేంకటనరసింహారావు నాయుఁడుగారు

ఈసత్కవీశ్వరుల్ భూసురోత్తంసులు
           గొప్పరపన్వయుల్ గుణకుశలులు