పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కట రమణాఖ్య సత్కవులు గాఢ మనీష నొనర్చినట్టి యు
త్కట రసభావ భాసుర వికాస వచో రచనా విలాసముల్.

కలిమిన్ గొప్పరపన్వయోద్భవులు నిర్గర్వుల్ గవీంద్రుల్సుధీ
శులు వీరిప్పుడొనర్చినట్టి సరసాశుస్ఫార వాగ్వైఖరుల్
చెలఁగెన్ బో నవకంబులై నవరసోత్సిక్తంబులై నవ్య ని
ర్మల మందార మరంద బిందులహరీ మాధుర్య ధుర్యంబులై

రైల్వే డిపార్టుమెంటులో నుద్యోగస్తులును బండిత కవులునగు మ.రా.రా గద్దె రంగయ్య నాయుఁడు గారు

మీకవితాపటుత్వమును మీమహదద్భుత కల్పనంబులున్
మీకమనీయపాకములు మీసమయోచిత యుక్తిశక్తులున్
నాకనివాసులన్ముదమునందఁగఁ జేయుననంగ నిట్టి భూ
లోకజనాళిభావముల లోఁగొనఁజేయుట యబ్బురంబోకో

నిక్కము పల్కెదన్ వినుఁడు నే మిముఁబ్రీతులఁజేయఁగోరిపెం
పెక్కసుతించుచుంటినని యెంచెదరేమొ యదట్లుగాదు మీ
చక్కని యాశుధారయును జల్లని శైలియుఁ బ్రౌఢవాక్కు లే
నెక్కడఁజూచియుండనని యెల్లరకున్ వివరించుటే సుఁడీ

తిరుపతి వేంకటేశ కవిధీరులొకెత్తును మీరొకెత్తుగా
సరితులదూఁచ వారలను సర్వవిధంబులఁ బోలఁదూఁగుచున్
పరమయశంబు వారివలెఁ బల్మరు దిక్కుల నించుచు న్మహా
గరిమఁ జెలంగు మిమ్ముఁగని కౌతుకమందితిఁ దృప్తిఁచెందితిన్

ఆయుర్వేదీయవైద్యజ్యోతిష విద్వాన్ శ్రీయుత, బి.వేంకటరంగమునాయుఁడుగారు

గురుతరసభ్యులార మనకొప్పరపుంగవులైన సుబ్బరా
యరమణమంత్రిపుంగవ కృతాద్భుత భవ్యశతావధాన స