పుట:Kokkookamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శంఖిన్యా వశకృంచ గంధతగరీమూలాన్వితం శ్రీఫలం
                        తాంబూలేన సహ ప్రదత్తమచిరాన్మంత్రౌరమీభిః క్రమాత్॥


వ.

“ఓం పచ పచ విహంగమ విహంగమ కామదేవాయస్వాహా”
అనేన మంత్రేణ కదళీకందరసం జాతీఫలం తాంబూలేన సహ
దద్యాత్తదా చిత్రిణీ వశ్యాభవేత్॥
“ఓం ఛేంది ఛేంది వశ్యంకరి వశ్యంకరి వశ్యంకరి కామాదేవాయ స్వాహా”
అనేన మంత్రేణ పారావతభ్రమరస్య పక్షౌ మధుయుక్తౌ తాంబూలేన
దేయౌ తదా హస్తినీ వశ్యాభవేత్॥
“ఓం హర హర పచకామదేవాయ స్వాహా”
అనేన మంత్రేణ గన్థతగరస్య మూలం బిల్వసహితం దేయం తదా
శంఖినీ వశ్యా భవేత్॥


సీ.

అరటిదుంపరసంబునందు జాజిఫలంబుఁ
                 దివిచి విడెమ్ము చిత్రిణికి నిడుఁడు
భ్రమరపారావతపక్షభస్ము తేనె
                 నునిచి విడెమ్ము శంఖినికి నిడుఁడు
మాలూరఫలరసమర్దితగంధంబు
                 కరమునఁ గూర్చియుఁ గరిణి కిడుఁడు
వశ్యులుగా న్విటవల్లభు లీమంత్ర
                 మంత్రములఁ బ్రణవాదిగా నలవరించి


గీ.

తవిలి కదళికామదైవాయ కలరవ
కారుదైవతాయ క్రమబిల్వ
కామదైవతాయ గరిమస్వాహా యని
వేఱువేఱు మంత్రివిధులఁ దెలిసి.


తా.

అరటిగడ్డరసములో జాజికాయను భావనచేసి తాంబూలముతో
చిత్రిణికి, తుమ్మెదరెక్కలు పావురపురెక్కలు భస్మముచేసి తేనెలోఁ గలిపి
తాంబూలముతో శంఖినికి, బిల్వపండ్లరసముతో శ్రీగంధమునూరి చేతితో హస్తి
నికిని వరుసగా "ఓం అనటికామదేవాయ స్వాహా। ఓం విహంగమకామదేవాయ
స్వాహా। ఓం శ్రీఫలకామదేవాయస్వాహా।" అను నీ మంత్రంబుల నుచ్చరించుచు
నామందులను యిచ్చి చిత్రిణ్యదికాంతలను వశవర్తులుగా జేసికొందురు.