పుట:Kokkookamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

లక్ష్మీవంజిచెట్టువేరును నేతితోఁ గలిపి ముక్కువద్ద నుంచుకొని గాలి
పీల్చినను, జటామాంసిని గుడితితోఁ గలిపి తాగినను స్త్రీకి గర్భము కలుగును.


శ్లో.

గోరేకవర్ణభాజః పయసా వన్ధ్యాపి ధారయేద్గర్భమ్।
పీత్వా కేకిశిఖాయాః పుత్త్రంజీవస్య వా మూలమ్॥


ఆ.

ఆవువర్ణ మొక్కటైనది యాయెనా
దానిపాలతోడఁ బూని పుత్త్ర
జీవివేరునైన శిఖమూలమైన సే
వింప గర్భ మగును వెలఁదులకును.


తా.

ఒక్కరంగుగల యావుయొక్క పాలను దెచ్చి యందు పుత్రజీవివేరు
నైనను లేక నెమిలియడుగుచెట్టువేరునయినను కలిపి త్రాగిన కాంతకు గర్భో
త్పత్తి యగును.


శ్లో.

పీత్వా౽మునైవ పయసా రజసి స్నాతా చ లక్ష్మణామూలమ్।
సప్తక్షాలిత శాలీభక్తం భుక్త్వా సుతం లభతే


ఆ.

చెఱఁగు మాసినట్టి చెలి లక్ష్మివంజిమూ
లమును దెచ్చి పాయసమున వండి
తినినయెడల నట్టి తెఱవకు గర్భమై
తనయుఁ డుద్భవించు మునిమతంబు.


ఆ.

చెలువలక్ష్మివంజిచెట్టుమూలం బేడు
మార్లు నీళ్ళ ముంచి మఱియు నెత్తు
నట్టినీటి వండు నన్నంబు సేవింపఁ
దనయుఁ డుద్భవించు మునిమతంబు.


తా.

లక్ష్మీవంజిచెట్టుయొక్క వేరును తెచ్చి పరమాన్నమున వండి ముట్టయిన
వెలది భక్షించినను లేక యావేరును యేడుపర్యాయములు నీటియందు కడిగి యా
కడిగిననీటితో వండినయన్నము తిన్నను యావెలదికి గర్భోత్పత్తియగును.

గర్భస్రావ నివారణోపాయము

శ్లో.

పీతం మధుసైన్ధవయుతముత్పలరాజీవమూలశాలూకమ్।
దళమపి గోధావల్యాః సా౽౽జ్యం రక్తస్రుతిం హరతి॥