పుట:Kokkookamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తేనె నేతులతోడఁ బూని మర్దన చేసి
                 మలపంచకంబుతోఁ గలియఁబిసికి
తిలకంబు పెట్టినఁ ద్రిజగద్వశంబగు
                 నటుగాక భక్ష్యాదు లందునిడిన


గీ.

సర్వజనవశ్యమగునుగా సాలెపురుఁగుఁ
గాకిఁ జంపియుఁ జూర్ణించి కడఁగి యాత్మ
జలముతోఁ గూడఁజేయు నౌషధముచేత
సర్వజనవశ్యమగు మునిసమ్మతంబు.


తా.

జాజిపువ్వును ఉమ్మెత్తపువ్వును తెల్లగ టెన మదంతి ఉత్తరేణి
జాజివిత్తులు పిల్లపీచర రుద్రజడ యీవస్తువులు నేయి తేనెలతో మర్దించి మలపం
చకము (అనగా తనయొక్క చెమట, ఉమ్మి, రక్తము, మూత్రము, శుక్లము.)
యీఅయిదింటితో కలిపి అబొట్టు పెట్టుకొనిన త్రిలోకవశీకరణమగును. మఱియు
పైన చెప్పినదానినే భక్ష్యవస్తువులలో కలిపి తినిపించిన వారు వశులగుదురు. ఇంక
సాలెపురుగును కాకిని చంపి చూర్ణము చేసి ఆ చూర్ణమును ఆత్మజలమున కలిపి ఎవరి
పై జల్లిన వారు వశులగుదురు.


శ్లో.

చూర్ణేన మక్షికాయా అసితశునీవక్షసశ్చ సహ చూర్ణమ్।
వశయతి వసిష్ఠభార్యామపి నిజబీజాన్వితం దత్తమ్॥


క.

వెలిగార మెఱ్ఱగిసెపూ
దళమును నూరించి యాత్మతనుజలముల స
మ్మిళితముగఁ జేసిపెట్టిన
వలచు న్సతి యెట్టి చెనటివాఁ డతఁడైనన్.


తా.

వెలిగారము యెఱ్ఱగిసెచిగుళ్లు ఈ రెండును నూరి అందుతన మలపంచక
మును కలిపి తినిపించిన పురుషు డెంతదుర్మార్గుడైనను స్త్రీ వలచును.


ఆ.

నల్లకుక్కపా లొనర జీడిగింజల
పొడియుఁ గూర్చి తనకుఁ బొడమునట్టి
శుక్లమునను గడుపుచోరఁ బెట్టగా నరుం
ధతికినైన మోహ మతిశయిల్లు.