ఈ పుట ఆమోదించబడ్డది
260
కవికోకిలగ్రంథావళి
మదనుఁడు,నృత్యకృత్యములు మాని చరించు మయూరసంతతిన్
వదలి రసార్ద్రగీతములు పాడెడు హంసల నాశ్రయించెడున్ .
హదనని పుష్పలక్ష్మి, కుటజార్జున సర్జ కదంబ నీపముల్
వదలి సమాశ్రయించె సుమవార మనోహర సప్తపర్ణలన్.
మదిరను గ్రోలినట్టి బలుమత్తడగంగ నిశీధిగాంతుఁడుం
గొదనుపిసాళి గబ్బిచనుగుబ్బలఁ గౌఁగిట నొత్త వత్తలై
మెదగఁగఁ, దెల్లవాఱ నొక మేచకకుంతల కేళివాసమున్
వదలి మఱొక్కెడన్ గదికిఁ బాఱుఁ దనుంగని తానెనవ్వుచున్
వనితల తనువుల నియ్యెడ
మనసిజుఁడు విపాండురముగ, మంధరముగ, జృం
భణ తత్పరముగఁ, గృశముగ
ఘనలావణ్య విలసితముగా వర్తించున్.
ప్రేంకణపుఁ బూవు కస్తురి
కుంకుమ కస్తూరిపసుపుఁ గూర్చి మెదిపి యే
ణాంకముఖులు కలపంబును
బొంకపుఁ దెలిగుబ్బచనులఁ బూయుదురిపుడున్.