పుట:Kavijeevithamulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కవి జీవితములు

    కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొమ్మనదండనాథుండు మధురకీర్తి
    విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రుపవిత్రశీలుఁడు సాంగవేద వేది
    యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల, నస్మదీయప్రణామంబు లాదరించి
    తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి, యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు.

శ్లో. కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా, పరిష్క్రియాయాం బహుమన్య సే త్వమ్,
   కిం కాలకూటః కిమువా యశోదా, స్తన్యం తవ స్వాదు పద ప్రభో మే."

వ. అని నీవు తొల్లి రచియించినపద్యము గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుం డగుహరిహరనాథుండు నీదెస దయాళుం డై యునికింజేసి నిన్నుఁ గృతార్థునిఁగా జేయఁ గార్యార్థియై నాకలోకనివాసి నైననాకుఁ దనదివ్యచిత్తంబునం గలయాకారుణ్యంబు తెఱం గెఱుంగునట్టి శక్తి ప్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయంబు చేయుచున్నవాఁ డనుచు జూపుటయు సవిశేషసంభ్రమ సంభరితహృదయుండ నై యవ్వలను గలయం గనుంగొని.

అని సోమయాజి తాను హరిహరనాథుని సుతియించినట్లును అపు డా దేవుఁడు తనయెడ దయాళుఁడై :-

క. "పారాశర్యునికృతి యయి, భారత మనుపేరఁ బరఁగు పంచమ వేదం
    బారాధ్యము జనులకుఁ ద, ద్గౌరవ మూహించి నీ వఖండితభక్తిన్.

గీ. తెనుఁగుబాస వినిర్మింపఁ దివురు టరయ, భవ్యపురుషార్థతరుపక్వఫలము గాదె
    దీని కే నియ్యకొని వేడ్క నూని కృతిప, తిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ".

అని హరిహరనాథుం డానతియ్యఁగఁ దా నందులకు నియ్యకొంటి నని సోమయాజి తెల్పి :-

ఉ. "కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నానఁ గ్రోలునాం
    ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయసంస్మృతి
    శ్రీవిభవాస్పదం బయినచిత్తముతోడ మహాకవిత్వదీ
    క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ గృతుల్."

    అని చెప్పెను.

సోమయాజి స్వకీయ శిష్టత్వమును బ్రకటించుట.

భారతము పంచమవేద మని ప్రసిద్ధిఁ జెందిన గ్రంథము. అట్టిదానిం దెనిఁగించు నవసరములోఁ దనకును దనవంశమునకును గల శ్రేష్ఠత్వమును, దేవతాభక్తి మొదలగువానిని బ్రకటింపక యున్నచోఁ దన గ్రంథము సర్వజనాదరణపాత్రము కా దనుతలంపుతో సోమయాజి