Jump to content

పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

325

అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. అవ్వలికథ తదనంత నావసధంబున నిట్లు చెప్పఁదొడంగెను.

________

240 వ మజిలీ.

మణిమంతునికథ.

స్త్రీరాజ్యపాలనావిశేషము లెట్లుండునో రత్నమకుట యెట్లు తీరుపులు చెప్పునో వినవలయునని యభిలాషగలిగి యొకనాఁడు పుష్పకేతుఁడు భార్యతోఁగూడ సభాస్థానమున కరిగి రత్నమకుట సింహాసనమునకుఁ బ్రక్కగా వేరొకపీఠంబునఁ గూర్చుండి యామెచేయు ప్రశ్నప్రకారము అరయుచుండెను. తనభర్తప్రక్కనుండుటచే వాడుక ప్రకారముగాక స్వరవైక్లబ్యముతో మంత్రిదిక్కు. మొగంబై యామె నేఁడు విచారింపవలసిన యభియోగము లేమిగలవని యడిగినది.

మంత్రి లేచి రాజ్ఞీ! నేఁడు ముఖ్యముగా హత్యాపరాధపరిశోధకములు రెండువిమర్శింప వలసియున్నవి. ఒకదానిలో వాది ప్రతివాదు లిరువురు వచ్చియున్నారు. ఒకదానిలో వాదిమాత్రమే వచ్చి యున్నాఁడు అని పలుకుచు నాకాగితములుకట్ట నామెచేతికిచ్చెను. రత్నమకుట చేయి వణక నందుకొని వానిభర్త కిచ్చుచు మీయెదుట మేము విమర్శింపలేము. మీరే విచారించి తీరుపుచెప్పుఁడని పలికినది

అతండు నవ్వుచు మీపాలనావిధానము జూడవలయుననితలంప నీభారము నామీఁదనే పెట్టితివా? కానిమ్ము మీయమాత్యుఁడు హత్యలనుచున్నాఁడు. అవి యెట్టివో తెలిసికొనియెదంగాక యని పలుకుచు నాపత్రికలం జదివికొని శిరఃకంపముతో ముందు మణిమంతుఁడు రత్న పాదుఁడునను వర్తకులఁ బిలువుఁడని భటుల కాజ్ఞాపించెను.

వాండ్రు పిలువఁగా నావర్తకులికువురు వచ్చి యెదుర నిలువం