Jump to content

పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కాశీమజిలీకథలు - పదియవభాగము.

విక్రముండు నవ్వుచు అమ్మా! మేము నీపతి నక్రమముగా జయించితిమని పలుకవలదు.

కొంత గడువిత్తుము. సేనలం గూర్చుకొని మీకడనున్న మహావీరులనెల్ల నాయత్తపరచికొని యుద్ధము సేయుమనుము. అందుఁ గూడ గెలిచినప్పుడే మాకు నీపతిచే జయపత్రిక లిప్పింపుము. అంత దనుక మేమిందొకచోట వసించియుందు మని పలుకుచు విక్రముండు క్రోధనుని విడిచి లేచెను. అప్పుడతండు లజ్జావనతముఖుండై లోపలికిఁబోయెను. అప్పుడారాజపుత్రులు ద్వారమున నిలిచియున్న మంత్రిసామంత ప్రముఖ యోధులనెల్ల లోపలికిబొమ్మని యాజ్ఞయిచ్చి సాధ్వీ ! మే మామఠమునకుం బోవుచుంటిమి జయపత్రికయో రణపత్రికయో మూడుదినములలో మాకుఁ బంపవలయును. నింతియగడువు. మేము బోవుచున్నారమని పలికి వారు మఠంబునకుం బోయిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు. . . ఇట్లు చెప్పఁ దొడంగెను.

_________

238 వ మజిలీ

అయ్యో భూలోకమునంగల చక్రవర్తులందఱు నాపేరువినినగడగడలాడుచుందురు. నా పాలిటికీవీరు లెక్కడనుండివచ్చిరో ! ఇప్పుడు నేను వీరికి జయపత్రికలిచ్చినచో నలువురలోఁదలయెత్తి తిరుగుట యెట్లు? ప్రేయసీ ! ఇట్టిపరాభవము నే బుట్టినతరువాత బొందియుండలేదు. మనయింటికివచ్చిన చుట్టములులోకైకవీరులని చారుమతి చెప్పినదిగదా! వారీ రాత్రి నింటికిఁరాగలరు వారింటనుండు నప్పుడైన వీరిని బిక్షకుఁ బిలిచితినికానే యౌరా! ఆకపటాత్ములు యతులవలె నెంతప్రచారముచేసిరి! ఇంతయేల జయవత్రికలిచ్చిపంపుమందునా. తిరుగాయుద్ధమునకురమ్మని సన్నాహము చేయుమందువా? ఇప్పుడు కర్తవ్య మేమని యడిగిన భార్య యిట్లనియె.

నాథా ! మీరు వారితో, బోరఁజాలరు వారు సామాన్యులు