Jump to content

పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవకన్యలకథ.

241

శ్లో॥ ముక్తావిద్రుమహేమ నీలధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణై
     ర్యుక్తామిందునిబద్ధ రత్న మకుటాంతత్వార్ధవర్ణాత్మికాం
     గాయత్రీం వరదాభయాంకుశకశాశ్ళుభ్రంకపాలంగదాం
     శంఖంచక్రమధారవిందయుగళం హశ్తైర్వహంతీంభజె.

సీ. మూడుకన్నులుగల్గు మోములైదు సితాది
               పంచవర్ణముల దీపించుచుండ
    బాలేందుచేఁ గట్టఁబడి పొల్పెనగు రత్న
               పుం గిరీటము మస్తమున వెలుంగ
    శంఖచక్రగదాది సాధనాబ్జంబులె
               న్మిదికరంబులను నెన్మిదియు మెఱయ
    నొకచేయి వరముల నొసగు చిహ్నముదెల్ప
               నభయప్రదత్వ మన్యమువచింప

గీ. గరిమ తత్వార్ధవర్ణాత్మికత నెసంగి
    కళల బ్రహ్మాండముల వెలుఁగంగఁజేయఁ
    జాలుదేవత యమ్నాయసమితిఁ గన్న
    తల్లి గాయత్రి విప్రసంతతుల సురభి,

అద్దేవతను సకలబ్రహ్మాండనాయకురాలగు గాయత్రిమహాదేవిగాఁదెలిసి కొనియతం డానందపరవశుండై చేతులు జోడించి యిట్లుస్తుతియించెను.

గీ. జపముజేయకయున్నను జనని యధిక
   మహిమ నీమంత్ర ముపదేశమాత్రముననె
   బాడబుల కిచ్చుచుందు బ్రాహ్మణ్యమీవు
   ద్విజులపాలిఁటి వేలుపు ధేనువవుగా.

క. నీ నిజరూపముగనిన, ట్లే నేనెద ముఱయుచుంటి నిపుడంబా! నీ
   ధ్యానముసేయఁగనుంటిమ,హానందమునాకుగూర్పవాదయతోడన్ .