Jump to content

పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అని తెలుపుటయు నామె త్రిలోక సుందరులైన కోడండ్రఁ బడసితినని మురియుచు వారు దెచ్చిన కనక మణివస్తు విశేషంబులం జూచి యానందించుచుఁ బుత్రులుగావించిన పౌరుష చర్యలు తెలిసికొని యుబ్బుచుఁ బాతాళలోక విశేషములడిగి నవియే పలుమారలడుగుచు నందుఁబోవుట కుత్సహించుచు నాలోకము కుమారుల స్వాధీనములోనున్నదని గర్వపడుచు సుధన్వుని భార్యల దేవకాంతలఁ గూడఁ ద్రికూటగిరిమధ్యనుండి రప్పింపుఁడని కోరుచు గొన్నిదినము లాత్మజ వృత్తాంతశ్రవణ తత్పరయై మహాసంతోషముతో వెళ్లించినది.

తాను నారదుఁడననియు సంసారమాయా విలాసములఁ జక్కతి ననియు నించుకయు దెలిసికొనలేక కుటుంబసక్త యై యొప్పుచుండెను.

అని యెఱిఁగించి . . . ఇట్లు చెప్పందొడంగెను.

__________

223వ మజిలీ

ఉత్తరదిగ్విజయము.

విద్యాసాగరుఁడు కళాభిరాముఁడు హరివర్మసుధర్ముఁడుసులోచనుఁడు వీరేవురు ప్రతాపరుద్రుని తరువాతివారు తాళధ్వజుని కుమారులు వారొకనాఁడు తండ్రి నికటమున కరుదెంచి నమస్కరించి యిట్లనిరి. జనకా! క్షత్రియులకు భుజబలాజిన్‌తమైన సంపదల ననుభవించుట యశస్కరము మాయన్న లేవురు పూర్వదిక్కంతయు జయించుటయేకాక లోకాతీత సౌదర్యంబునం బ్రకాశించు నించుబోఁడులఁ బెండ్లియాడి నిరుపమానమగు విభవముతో నింటికివచ్చిరి.

మే మమ్మహావీరులకు సోదరులము మీకుమారులము నగుట మాకుఁగూడ విజయ యాత్ర సేయవలయునని యభిలాష గలుగు చున్నది. నాలుగు దిక్కులలో నుత్తరదిక్కు మిక్కిలి పెద్దది. అం