స్త. 4.
ఇంద్రాణీ సప్తశతీ
133
21. శీర్ష స్థానమందు నిన్నా లోచనరూపముగాను, నేత్రస్థానమందు చూపుగాను, హృదయస్థానమందు చైతన్యముగాను, కుండలినీ స్థానమందు దీప్తనుగాను, (ముందఱి శ్లోకములో నన్వయము)
22. ఓ తల్లీ ! ఎవడీలోకములో నిన్నట్లు ధ్యానించునో, వానికంటె శ్రీమంతు డింకొకడుండడు. వాని చరణము పవిత్రమై కొలువ దగినదగును. వాని చరిత్ర శ్రేష్ఠమై, వర్ణింపదగినదగును.
23. ఓ దేవీ ! మాయాబీజముగాని, దోగ్ధ్రీబీజముగాని, రసనా బీజముగాని యేప్రాజ్ఞుడు మంత్రముతో జపించునో, వాడు నీ కరుణకు పాత్రుడగును. వానికి సర్వ కార్యములు హస్తగత మగును.
మాయాబీజము = హ్రీం
రసనాబీజము = క్రీం
దోగ్ధ్రీబీజము = హూం
24. ఓ దేవీ ! ఛిన్నభిన్నమై క్షీణించుచు, అన్నము లేక అంతటను దుఃఖించు భారతభూమిని రక్షించుటకు నాకు శక్తినిమ్ము.
25. లెస్సగా రచింపబడిన బృహతీ ఛందస్సు గల 'మాత్రా సమక' వృత్తము లింద్రాణి కర్ణ మార్గమున బ్రవేశించి, యామెకు తృప్తినిచ్చుగాక.
- ___________