స్త. 4.
ఇంద్రాణీ సప్తశతీ
93
డనుటయే యుక్తము. పైశ్లోకమున భర్తతో విహరించునపుడు చంద్రముఖియునియు, నిందులో శత్రువులతో యుద్ధము చేయునపుడు సూర్యునివలె జ్వలించు ముఖముకలది యనియు జమత్కరించెను. "రాకేందు బింబమై రవిబింబమై" అను పోతనగారిపద్యము స్మరింపఁదగును.)
5. నారిటంకారములచే రక్కసులకు భీతి గలిగించుచు దేవతలకు ప్రీతినిచ్చు శచీదేవి విరాజిల్లుచున్నది.
6. దేవేంద్రునిశక్తిని ధరించునది, శత్రువుల ఆడంబరమును నివారించునది, మునులకు ముక్తినిచ్చునది యగు శచీదేవి నాకుశరణము.
7. కృశించిన స్వదేశమును దర్శించుటవలన, భిన్నమైన స్వజాతిని వీక్షించుటవలన ఖిన్నుడనై యున్న నాకు సంశ్రితులను రక్షించు శచీదేవి గతి యగుగాక.
8. సంఘము వెయ్యి విధములుకాగా, దేశము హీనస్థితినిబొంది యుండగా శోకమందు మునిగియున్న నాకు లోకములను కాపాడు శచీదేవి గతి యగుగాక.
9. ఆమె జ్ఞానమున కధిదేవత. పరమైన స్వరమామెకు వశమై, ఆమెచేతనే సర్వము విధింపబడుచున్నది గనుక శచి పరాదేవిగా వచింపబడుచున్నది.
10. ఆమె యత్యంత సూక్ష్మరూపిణియైనను సర్వవస్తువులందు బ్రకాశించుచున్నది. ఆమె నిరూపమానమైన ఆకాశమును కొలత చేయుచున్నది. కనుకనే పరా దేవియని శచి వచింపబడుచున్నది.