నాగ: నీవు అమ్మదగ్గరకు పోయి, అమ్మఒడిలో పండుకో. పెద్ద వారి సంగతులు నీ కెందుకే?
సువర్ణ: | ఓ హో హో | |
సిద్ధా: | (విరగబడి నవ్వుచు, చప్పట్లుకొట్టుచు) | |
సువర్ణ: నాయనగారు ఈపాటికి ఎంతదూరము పోదురు?
నాగ: విదిశాలిపురము.
సిద్ధా: గోదావరికడకు.
నాగ: (వణుకుచున్నట్లు నటించుచు) విదిశాలికి, గోదావరికి ఎంత దూరము మనుమరాలా?
సిద్ధా: అమ్మమ్మా! ఆరుక్రోశములు.
నాగ: (వణకుచునే) నీకు లెక్కలు సరిగా వచ్చునా?
సువర్ణ: మా అమ్మాయి బాగుగా చదువుకొనుచున్నది అమ్మమ్మా
నాగ: ఒరే పసికుఱ్ఱ! నీవు మాటలాడకు. క్రోశ మనిన ఏమిటి పసిదానా?
సిద్దా: గోరుతము.
నాగ: అర్థము సరియే! లెక్క చెప్పుము.
సిద్ధ: అలాగునా, అమ్మమ్మా! ఇరువదినాలు గంగుళము లొక హస్తము. ఎనిమిదివేల హస్తములొక క్రోశము. రెండుక్రోశము లోక గవ్యూతి. రెండు గవ్యూతు లొక్క యోజనము. నాలుగుహస్తము లొక ధనువు. వేయిధనువు లొక గోరుతము.
సువర్ణ: బయలుదేరిన యామములోనే గోదావరీతీరమునకు బోవుదురు గాబోలు! నాయనగారింటికడ లేరు. ఈ గృహయజమానిని నేను. బాలికలారా! మీ మీ మందిరములు చేరుకొని ప్రార్థనలు చేసికొనుడు. నేను అర్చన చేసికొనవలయును.
నాగ: ఓసి చెల్లీ! అన్న హిమబిందు హృదయము తస్కరించుకొని వచ్చినాడు. తలవరులకు తెలిసిన ఏ మందురు?
సిద్ధా: ఏ మందురు?
సువర్ణ: మీ ఇద్దరికీ నోటితాళములు వేయుదురు.
సిద్ధా: అన్నా! ఏదీ హిమబిందుహృదయము చూపెట్టవూ మాకు?
అడివి బాపిరాజు రచనలు - 2
• 123 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)