పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీ. శే. బ్రహ్మశ్రీ కాకర్ల శ్రీరాములుగారు

వీరు 1877 వ సంత్సరములో, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడు గ్రామములో జన్మించిరి. 1895 వ సం.లో అనగా తన 18 వ ఏట, 5 గురు పిల్లలతో ఒక రిజల్టు గరల్సు స్కూలు వీరు ప్రారంభించిరి. అప్పటినుండి, స్త్రీవిద్య గురించి పాటుపడి, అధికారుల మన్నన పొందుచు, ఆ స్కూలును 1909వ సం.వరకు నడపిరి. 1909వ సం.లో, 150 మంది పిల్లలతోను, 4 గురు ఉపాధ్యాయులతోను, ఆ స్కూలును నర్సాపురం బోర్డువారికి అప్పగించినారు. అప్పటినుండి, 1932 అక్టోబరు వరకు పనిచేసి రిటైరు అయినారు. అనగా, మొత్తము 37 సంవత్సరములు స్త్రీవిద్య గురించి పాటుపటి, మొన్నటి వైకుంఠ ఏకాదశి నాడు, 27-12-1933 సం.న కాలముచేసినారు.

ఈయన నిష్కపటి, రామభక్తుడు, సర్వీలెక్కలలోను, వైద్యమునందును, కవిత్వమునందును ఈయనకు ప్రవేశముండెను. మట్టితో బొమ్మలను ఆయన అభిమానముగ చేయుచుండెడివారు. "స్త్రీవిద్య" అను సంగతి తెలియని కాలములో వీరు ఆ విషయమున పాటుపడియుండుటవల్ల భీమవరము తాలూకాలోని పెద్దలు చాలామంది వీరి నెరుగుదురు.

పరమేశ్వరుడు వీరి ఆత్మకు శాంతినొసంగుగాక !