గ్రంథాలయ సర్వస్వము
సూత్రయుగముల • శుద్ధవాసన
క్షాత్రయుగముల • చండశౌర్యము.
చిత్ర దాస్యము . చే చరిత్రల
చెఱిగిపోయె నె తుమ్మెగా !
పాండవేయుల • పదునుకెత్తులు
నుండి మెఱసిన
మహిళ రణకధ
కండగల చి . క్కవి తెనుంగుల
కదికి పాడవె తుమ్మెదా
50
లోకమంతకు + కాకఁ బెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని • చేపమాటల
చేర్చికూగ్పవె తు మ్మెగా !
వెతుమ్మెదా
03
తుంగభద్రా . భంగములతో
పొంగినింగిని . పొడిచి త్రుళ్ళీ
6
ధంగపడవి కై మంగునాగుల
పశి<ఁ బాడవె తుమ్మెదా !
పసుపుకొంగుల
ముసుగులెడలగ
కొసలు తీర్చిన . కోగకత్తుల
కసరిపోరిన గండుయోధుల
పసలు పాడవె తుమ్మెదా !
రాయప్రోలు సుబ్బారావు.
మనుచరిత్రము -మానవజీవితము*
మనము మన ప్రాచీనాంధ్రుల యౌన్నత్యమును గూర్చి విఱ్ఱవీఁగుచున్నాము. కాని యాయాన్న త్యము -కు మూలాధారమేది ? గంగానది మొదలు కావేరి వరకును వ్యాపించి యొక్కప్పుడు మహోచ్చ దశలో నుండిన మన ప్రాచీనాంధ్రసామ్రాజ్యమా? అది కాదు. ఆసామ్రాజ్య మెప్పుడో యంతరించినది. 'ఆనగరములు మట్టిపాలైనవి. ఆశిల్పికళ అడుగంటివి. మహానది మొదలు కన్యాకుమారివరకు వ్యాపించిన విద్యానగర సామ్రాజ్యమా? అదికూడ మున్నూ రేండ్ల క్రిందటనే యంత చెంచినది. ఆనగరములు నేలపాలైనవి. ఆదేవాలయములు పూజా పునశ్చరణములు లేక బూజుపట్టినవి. కావున, మన పూర్వుల యౌన్నత్యమును గూర్చి మనము విఱ్ఱవీగుట కల్యావశిష్టములైన ప్రాచీన కళలనుజూచియా? కాదు. ఎన్నటికిని నశింపని జీవకళ లుట్టిపడుచుండు మహా కల్పములు కొన్ని కలవు. మన ప్రాచీన మహామహుల యాదగ్శములకు నవియే బహిః ప్రతిమలు
“సప్తసంతానములలోఁ బ్రశస్తి గాంచి ఖిలముకాకుండునది థాత్రిఁగృతి యెకాన"
అని వీరాగ్రేసరుఁడు శ్రీకృష్ణ దేవరాయలు చెప్ప యున్నాఁడు. ఆ వాక్యమును పెద్ద నార్యునితో జాతఁడు చెప్పుచున్నప్పుడు తనరాజ్యమును, తనయైశ్వర్యమును, తన దేవాలయములును, తవశిల్పములును-నీశ్వరములని యా తనికిఁ బొడక ట్టెను. తన నారుముకు, తనయశస్సును, నాచం ద్రార్కముగా నిలుపఁజాలిన సామర్ధ్యము వానికి లేదని యాతఁ డెఱుంగును. ఇక నట్టి సామర్ధ్యము గల మహాశిల్ప మొక్కటియే కలదు. అది కృతి. కావు న #"కృతిరచింపుము మాకు శిరీషకుసును పేశలసుధామ యోక్తులఁ బెద్ద వార్య" అని యానతిచ్చియున్నాఁడు. ఆంధ్రుల సామ్రాజ్యాతిశయము-ఆంధ్రులవిద్య, -
- బ్రహపురాంధ్ర భాషాభివర్ధనీ సమాజ వార్షికోత్సవ సందర్భమునఁ జదువఁబడినది.