Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేంద్ర గ్రంథాలయము ——బరోడ

న్నను, ఉన్నతమైన భావములందు జీవించియే యున్నవి. నలుదిక్కులకును- పట్టణములకు, పల్లెలకు, యంత్రశాలలకు స్త్రీ సమాజములకు, పాఠశాలలకు, కారాగారములకు, రక్షక భటస్థానమునకు - పలుస్థలములకు పోవలెనని అవి ఉరక లెత్తుచున్నవి. అనేక పల్లెలయందలి గ్రంథాలయములకు ఈ సంచార గ్రంథాలయ పేటికలే ప్రాతిపదికములైయున్నవి.

కర్ర పెట్టెలు—అందులో గ్రంధములు——అంతే-- ఆవి వివిధజనులమనస్సుల చందు నాగరికతాబ్కీములను నాటుచున్నవి. అ నేకగృహముల నవి సౌఖ్యవంతములుగ జేయు చున్నవి. అనేక పాఠశాలలయందలి పిల్లలకవి జ్ఞానబో ధనుగావించుచున్నవి. ఒంటరిగానుండు అ నేక మందికవి స్నేహితులలోటును దీర్చుచున్నవి. అవి అద్భుతములను చేయుచున్నవి. అయినప్పటికి వాని ఖరీదు స్వల్పము. అందుచేత కేంద్ర గ్రంథాలయము వారు ఈ పనిని మిక్కిలి ఆసక్తితో చేయుచున్నారు.

చిత్రపట ప్రదర్శనము.

ఈశాఖను దర్శించినపుడు ఆగొప్పవారే ఇట్లనికట:- “బొమ్మలుచూపు నాటకి శాలతో సమానమైన స్థితికి దిగుట గ్రంథాలయమునకు దగిన పనిగాదు. గ్రంథములను పత్రికలను సంపాదించి, జనులు చదువుకొనుటకియ్యవలసిన గ్రంధాలయము- జనులను ఆనందపరుచుటకు ప్రయత్నించుటయా? కేంద్ర గ్రంథాలయమువారికి పిచ్చిఎత్తియున్న గాని చిత్రపటప్రదర్శనశాఖను ప్రారంభించి యుం డరు” దానికి గ్రంధభాండాగారిట్లు జవాబిచ్చెను:— "అయ్యా ! దయచేసికొంచెము శాంతము వహింపుడు. నేను చెప్పుసంగతులు వినకుండ నన్ను నిందించకండి.” దానికిగూడ ఆగొప్ప వారిట్లనిరి: “వెంట నేమీజవాబా ? ఇట్టి నిరుపయోగ మైన పనిని గూడ సమధింపబూనిన ప్రయోజన మేమి?" అందుమీద గ్రంథ భాండాగారి శాం తముతోనిట్లు చెప్పెను:— “చదువురాక జ్ఞానము లేక, భావములులేక, ఉన్నతస్థితిని పొందవలయుననెడి కోరిక లేక, జీవితమునందానందము లేక, అసహాయులై, నిర్భాగ్యలైయున్న జనులకొరకు ఈచిత్రపట ప్రదర్శనశాఖను ప్రారఁభించితిమి. నిత్యజీవనమునందు వారి కనుభవ సిద్ధములుగ నుండదగిన ఆ నేక విషయములను గూర్చిన చిత్రపటములను వారికిచూపి బోధింతుము. ప్రకృతిశాస్త్రము, మానవశరీరము, ఆరోగ్యము, కళలు, పరిశ్రమలు, మున్నగు అనేకవిషయములనుగూర్చిన పటములను వారికి జూపి, జ్ఞానవంతులుగ చేసెదము. నాటకములు, చరిత్రలు, కథలు మున్నగునవి చెప్పుచు వానికి సంబంధించిన బొమ్మలను మాపుచు వారికానందమును కలుగచేసెదము. భూగోళశాస్త్రవిషయములను పటములతో బోధించి, వారికియీ ప్రపంచముయొక్క స్వరూపమును గోచరింపజేతుము. వివిధ దేశములందలి జనులనడవడికలు, గొప్పస్థలములు మున్నగువానినిజూపి వారికి జిజ్ఞాస గల్పింతుము. ఇంతే గాక ఇంకను అ నేక సంగతులు వారికి పరిస్ఫుటముగను, హృద్దతమగునట్లును బోధింతుము. 'సిని మెటోగ్రాఫ్' ప్రదర్శనములలో ప్రదర్శకుడు ఊరకే నిలువబడియుండులా గున మేమునిలువబడియుండము. ఒక బొమ్మను చూపుటకు పూర్వము, చూపుచున్నప్పుడు, చూపుటముగింపబడినప్పుడుగూడ, మేము మాట్లాడుచునేయుండి ఆ బొమ్మనుగూ ర్చి వివరించుచు దానివలన నేర్చుకొనవలసిన సంగతులను వారికి చె ప్పెదము. ఈబొమ్మల ప్రదర్శకములకు అందరును రావచ్చును. ఎవరైనను సొమ్మేమియు ఇయ్యనక్కరలే దు. రాజ్యములందు మారుమూలలనుండుటచే, 'సినిమిటోగ్రాఫ్'కం పెనీలు ఎప్పుడు గానిపోజాలనట్టి కుగ్రామముల కుగూడ మా' సిని మెటోగ్రాఫ్ నంపి, జనుల కానందమును గలిగించెదము” అంతేట వారి అభిప్రాయములన్ని యుమారి, వీరు చేయుచున్న పనినిగూర్చి మెచ్చుకొనిరి.

ఈ కేంద్ర గ్రంథాలయమును స్థాపించి కొద్దివత్సరములు మాత్రమే అయినప్పటికిని, నవీన గ్రంథాలయోద్యమము భారతవర్ష మున ఎట్లు ప్రబల చేయదగునో ప్రదర్శించినది. ఈ కేంద్ర గ్రంథాలయము ఇపుడు రా స్వంతభవనమునందే ఉన్నది. దానికి ప్రత్యేక భవనమును నిర్మాణముచేయుటకై ప్రయత్నములు రాజు గారు చేయుచున్నారు. దీనినికట్టుటకై ప్రత్యేక మొక స్థలమును లక్షరూపాయిలు ఖరీదునకు దీసికొనిరి. మహారాజుగారికీ కేఁద్రగ్రంథాలయము ముద్దుబిడ్డ. ఇక దానియొక్క అభివృద్ధికేమి కొరతగలదు?