Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

శోధనకు నిలయముగను, చేయు టెట్లు? అను చింతనలే కేంద్ర గ్రంథాలయమును కలత బెట్టుచుండును. ఈ ప్రశ్నలకు జవాబులను చాల భాగ మది కనుగొనినది. మిగిలిన వానికిగూడ కనుగొనుచున్నది.

బాలుర ఆటలు.

గ్రంథాలయములయందు బాలురు ఆటలాడుకొను టకు - అవకాశముగల్పించుట కలలోనైన తలంపజాలని విషయము. ౯ సం॥న మహారాజాగారి అభిలా షచే కేంద్రగ్రంథాలయమునందు బాల శాఖ ప్రారంభింపబడినది. అభివృద్ధి మాగణములను సరియైన దృక్కులతో చూడజాలని వారికీవిషయము వింతగొల్పవచ్చును. “గ్రంథాలయములు చదువుటకా, ఆటలాడుటకా? గ్రంథాలయములకుపోవు పిల్లలు ఆటలకు మరిగి చెడిపోరా? వారి “కాలము వృధా కాదా?" అని అట్టివారు ప్రశ్నింతురు. ఈ కాలమునందు గ్రంథాలయము పెద్దవారలకుమాత్రమెకా దు; భాల్యమునుండియు గ్రంథాలయములరుచిని చూచినవారే పెద్దవారైన పిమ్మట వానిపోషకులగుదురు. అందుచేత పెద్దలకంటే పిల్లలకు కావలసిన విషయములు దే ఈకాలమునందలి గ్రంథాలయములు విశేష శ్రద్ధను వహించును. ఆటలకంటే పిల్లలకు హృదయరంజకములగు విషయము లెవ్వి? గ్రంథాలయమున కనుబంధముగ నున్న బాలశాఖయందు ఆటలనాడుకొనుటవలన పిల్ల లెందుకు చెడిపోయెదరు? ఆనందముగానుండుట లాభకరముగాదా? వివేకము మందము గానుండుకాలము భాల్యమనియు పిల్లలు ఆటలందు వినియోగించు కాలము వృధాయగుటకు బదులు అభివృద్ధి హేతువనియు తెలిసికొనుడు. బాల శాఖను నడుపునట్టి భాండా గారియెడల క్రమముగ పిల్లలు ఉంచునట్టినన్ముకము, చూపునట్టి గౌరవములను చూచినవా "డెవ్వడును- అక్కడవారుఆడునట్టి ఆటలు అనావశ్యకములనియు అసంగతములనియు వారిగుణములను చెరచుననియు చెప్పజాలరు. బాల్యమునందు గ్రంథాలయమనువలలో దగుల్కొనజేసి, గ్రంథపఠనాభిలాషను కలిగించి, పెద్ద వారగునప్పటికి అనగా వారివివేకము మందముగా నుండుటనుమాని జాగరూక తావస్థను పొందు కాలమాసన్నమ గుసరికి- గ్రంథాలయముయొక్క ఆశ్రయులుగ చేయు చున్న పని చూచినవారెవ్వరును బాలః ఖ యందు పిల్లలాడుకొనుటను చూచి వానివలన లాభము లేదని భ్రమింపరు.

కథలు చెప్పుట.

భారతవర్ష మునందు కథలు చెప్పు ఆచారము మిక్కిలి పురాతనము. మనగృహములందు ఇప్పటికిని ముసలమ్మలు తమచుట్టును పిల్లలను చేర్చి వారికి చక్కని కధలను చెప్పుచుందుకు. గ్రంథాలయశాస్త్ర మునందు ప్రపంచమునంతకును ఆదర్శప్రాయమైయున్న అమెరికాడే శమునందీ కథలు చెప్పుటను, గ్రంథాలయముల ప్రయోజనములను నెర వేర్చుకొనుటకై ప్రధమమునందుపయోగింపబడినది. అందుచేత అమెరికానుండివచ్చిన శాస్త్ర వేత్తచే ప్రారంభింపబడిన బరోడా కేంద్ర గ్రంథాలయము నందుగూడ కొద్ది సంవత్సరముల క్రిందట కధలు చెప్పు పద్ధతి ప్రారంభింపబడినది.

కథలు బాలురకు అత్యానందమును గలుగజేయును. కథలవలన బాలురకు దైవభక్తిగలుగును. కధలు వినుట వలన తమంతటతాము ఏర్చుకొని చదువజాలని గ్రం ధములను వారు చదువుట కభిలాష కలుగును. ఇంతే గాక తమకు కధలు చెప్పునట్టి కొండా గారియెడల ప్రేరు - గలిగి, అతడు చెప్పునట్టి బోధనలయందు విశ్వాసము కుదురును.

సంచారగ్రంథాలయములు.

"ఓహో! ఏమిటిది? కర్రపెట్టెలు, కొన్ని చిన్న వి, కొన్ని పెద్దవి, కాని అన్నిటియందును పుస్తకములు కలవు. వీనియందేమియు విశేషమున్నటులు నాతలంపునకు దట్టుటలేదు ఈ పెట్టెల యుఁదేమైన విశేషమున్న దా? అవికూడ సందేశమేమైన దెలుపు నాయేమి?" అని బగోడా కేంద్ర గ్రంథాలయమును దర్శించిన గొప్పవారొకరు అనిరట. ఆ పెట్టెలయందు విశేష మేగలదు. ఆసంచార గ్రంథాలయ పేటికలు పైకి జీవము లేనివిగ కాన్పించుచు