Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
కాని క్వాచిత్కము. అదిగాక ధర్మరాజను పేరు

చాలవఱకీ చిత్ర వైరుద్ధ్యమును గప్పి పెట్టుచున్నది. వ్యా సుఁడు వ్రాసిన వ్రాతలు సదివియే, చేసిన చేతలుసూచియే మహాకవి వేమన పేరుధర్మరాజు. పెను వేపవి తయా విశ్వదాభిరామ వినుర వేరు! అని సవ్యాజము గాఁ బాడియున్నాఁడు. యుధి స్థిరజీవితమునందు గొన్ని యంశములు వాదనీయములు. ఈయు త్తను క్షత్రియుఁడు జ్ఞానయోగియా లేక కర్మయో గియా? నీతిజ్ఞుఁడా లేక నీతినిర్వాహకుఁడా? నాధనస వృద్ధుఁడా? లేక సాధన సమర్ధుఁడా? ఈవిషయములు తేలవలెను. ఇవియన్నియు సున్నితమయిన భేదములు • -క్ష్మమయిన భావనర్చలు; కాని ఈనిరూపణము న చియె ధర్మరాజు జీవితము పోషింపబడవలసియు ది. ధర్మజుఁడు ఎంత వేత్తయో అంత సంకల్ప స్థైర్య ముకలవాఁడుకాఁడు. ధర్మ సందేహములను నిశితబుద్ధి తో కదలించువాఁడేకాని ఆత్మవిశ్వాసముతో స్థిరీకరిం చువాఁడుకాఁడు. ద్యూతము నిషిద్ధధర్మముని యాతఁడె ఱుఁగును. కాని సంప్రదాయ సిద్ధమను క్షుద్రసంశయ మును భాపికొనలేకపోయెను. ధర్మపత్ని ద్యూత పణ ముకాఁదగునని యొకఁడా దేశింపఁగా, అపుడు విధినిషే ధముల నెఱుంగనట్లు ప్రవర్తించెను. ఈపోకడ ఒకా నొక విషయమును దెలుపుచున్నది. అదియేదన? ధర్మ జునిగ్రహణశక్తి చక్కని విచారదృష్టిగలదైనను అనుష్ఠా నఘర్షణమునందు స్వయంసంఛన్న మగు స్వభావగౌర్బ ల్యము లేనిది కాదు. విషయవేగమ్ముల భాగతరణమునం దు ఇతఁడు తనకై తాను నడపిన సందర్భములు చాల అ రిది. ఒకానొక కార్యమునకుఁ దాను కారకుఁడైనను, లోకము తాను నిమి త్తమాత్రుఁడని నిశ్చయించులాగు ప్రవ ర్తించు ఉపాయమునందుఁ జక్కనికుశలుఁడు. అందువలన దూరదృష్టి లేని మందప్రజ్ఞుఁడని యూహింపరాదు. తా నెన్ని కార్యములు చే సినను ఆ “చం. బ్రతికిన నాల్గునాళ్లు ఋతవారియుధిష్ఠిరుఁడ తి చెడకుండనుండు తెఱఁగుఁ బాటించుట ధర్మజుని విజయదశమి మతము. అయితే ఇందొక సూక్ష్మవిషయమున్నది. ధర్మ రాజ నిర్ణ యములన్ని యు ణ " ఏక క్రియాద్వ్యర్ధి క రీ 2 " అను న్యాయమునకు బ్రమాణము లగుచుండును. కృష్ణ రాయభారమును సంకల్పించినవాడు ధర్మరాజు; తదౌచితిపట్లఁ గృత నిశ్చయుఁడు ధర్మరాజు. కాని నిశిత విమర్శనకుఁ ద్రోసినపుడు శ్రీకృష్ణ రాయభారమునకుఁ బ్రధాన కారణము యుధిష్ఠిరుని ఉపాయచాతుర్యమా? లేక త దర్భ సిద్ధమయిన స్వయంకృత కార్యమా? అనుకొ ప్ప సంశయమును పైకిఁ దెచ్చును. ఇఁకఁ బూర్వపక సిద్ధాంతములకుఁ గావలసినంత తర్కము. వీనికేమి ! ధర్మరాజు కొండొక బలవత్తర హేతువుచే నీ నాయక త్వపదవికిఁ దొలఁగి నిలచుచున్నాఁడు. భారతము ఇతి హాసము. రెండు రాజ కుటుంబముల స్వార్ధ స్వామ్యము లకు సంబంధించిన పెనఁగులాట. ఇందెంతవఱకును విష రా యోద్ధతీయున్నది కాని, విషయలాలిత్యమున కవకాశము లేదు. ఈ రణకధనమునకుఁ బ్రధాన నాయకత్వము జధర్మముచే నిరూపింపఁదగినది. అంతేకాని ధర్మరాజ త్వముచే సమన్వయించుకొనవలసినది కాదు. భారతమం దు ధర్మరాజు స్థితి మొదటినుండియు నట్లేయున్నది. ఉ దాత్తధర్మనును దృష్టితో స్వధర్మము ననేక సందర్భ ములఁ దగులఁ బెట్టెను. ఆతని ధర్మము ఏయుత్తమ ధ ర్మమయినను గావచ్చును; కాని ఉత్తమమగు క్షత్రియ ధర్మము మాత్రము కాదు. "శా. వారు బ్రాహ్మణులె యేకీడైన సైరింపఁగక్. అను కవిపలుకులలో నీ రహస్యమే బయటపడు చున్నది. క్షత్రియధర్మమునందు కార్యనిశ్చయము ప్ర ధానము. బ్రాహ్మణధర్మమునకు కార్యచర్చ ముఖ్యమ యినది. ధర్మరాజునందీ గుణదుర్బలత్వము చాలఁ గలదు. తె గఁబడి కర్ణునితో తారసిల్లినపుడయిన ధర్మజుని క్షాత్రము నైజసాహసముతోఁ బ్రజ్వలించినది కాదు. తనయసమర్ధ తకుఁ దానులజ్జింపక తమ్ముని దిట్టసాగెను. కర్ణ విజృం భణమునకును అర్జునోపాలంభమునకును సందర్భముఁ గ ల్పించిన క్షత్రియనాయకుని ధర్మదృష్టియెట్టిదో యూ హింపుడు. ఈయన శాపనార్ధములలో