Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వర్గమున నుండు నిందఱు వరుసతోడ, నేకభంగిఁ బ్రవర్తించిరే మునీంద్ర.

2068


చ.

మునివర సత్యసంధుఁ డగుభూపతి స న్నిటు కాననోర్వికిం
జను మని పల్కె నేనును బ్రసన్నమతి న్సభ యాలకింపఁగాఁ
జనియెద నంచు నీయకొని సమ్మతి వచ్చితి సత్య మూఁది య
జ్జనకునిశాసనంబు కడుసత్య మొనర్పక రిత్త వుత్తునే.

2069


ఆ.

వేయి పలుకు లేల వినుము తాపసవర్య, చెలఁగి తండ్రిపంపు సేయువాఁడ
మోహలోభకామముల నైనఁ దగ సత్య, సేతువునకు హాని సేయ నయ్య.

2070


ఆ.

విను మసత్యసంధు ననభిజ్ఞు నస్థిర, చిత్తు మలిను సాధువృత్తిశూన్యుఁ
జూచి పితరు లఖిలసురులును హర్షింప, రనుచుఁ బలికి రార్యు లదియు వినమె.

2071


వ.

మునీంద్రా యేను సత్యరూపం బైనయీధర్మంబు నాత్మయం దవినాభూ
తంబుగా నవలోకించెద సత్పురుషాచరితం బైనజటావలయాదిభారంబు సత్య
రూపధర్యార్థం బభినందించుచుందు భవదుక్తధర్మంబు క్షుద్రనృశంసలుబ్ధపాప
కర్ములచేత సేవింపందగినయది గాని యస్మదాదుల కంగీకార్యంబు గా దధర్మ
ప్రచురధర్మలేశయుక్తక్షత్రియధర్మంబుఁ జరిత్యజించెద మనోవాక్యాయజం బైన
త్రివిధపాతకకర్మంబు నవ్వలం ద్రోచి పుచ్చి త్రివిధసుకృతకర్మంబు నంగీకరించి
సత్యంబునం బ్రవర్తింపవలయు భూకీర్తియశోలక్ష్ములు సత్యవాది యగుపురు
షునిం బ్రార్థించుచు నతని స్వర్గగతునిఁ గాఁ దలంచుచుండ్రు నీవు నిశ్చయించి
యిది భద్రంబు దీనిం గావింపు మని యుక్తికరంబు లైనవాక్యంబులచేత నన్ను
నియోగించితి వది యనార్యంబు దాని నంగీకరింపం దగ దేను గురుసన్నిధి
యందుఁ బదునాల్గువత్సరంబులు వనవాసంబు సలిపెద నని ప్రతిజ్ఞఁ జేసి వచ్చితి
నప్పుడు మద్వాక్యంబు విని కైకేయి సంప్రహృష్టచిత్త యయ్యె నిప్పుడు గురు
వచనోల్లంఘనంబుఁ జేసి భరతునివచనం బెట్లు గావింతు గురువాక్యప్రకా
రంబున వనవాసంబు సేయుచు నియతవన్యాహారుండ నై శుచి నై పుణ్యంబు
లైనమూలపుష్పఫలంబులచేత దేవతలఁ బితృదేవతలఁ దృప్తి నొందించుచు
సంతుష్టేంద్రియవర్గుండ నై శ్రద్దధానుండ నై కార్యాకార్యవిచక్షణుండ నై
యకృత్రిముఁడ నై పితృవచనపరిపాలనరూపం బైనలోకవర్తనంబు ననుసరించి
ప్రవర్తించెద నని పలికి వెండియు ని ట్లనియె.

2072


క.

కర్మమునఁ గలుగు భద్రము, శర్మదహితకర్మభూమిసంజాతనరు
ల్కర్మములు సేయఁగాఁ దగుఁ, గర్మంబునఁ గాని లేవు జ్ఞానసుఖంబుల్.

2073


చ.

అనఘ ధనంజయానిలశశాంకులు కర్మముచేఁ బ్రదీప్తు లై
తనరిరి గాదె శక్రుఁడు శతక్రతువు ల్దగఁ జేసి తా దివం