Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వీతధనలోభు లై పక్షపాత ముడిగి, సత్య మాడుదురే నీదుసచివు లనఘ.

1928


తే.

అనఘ మిథ్యాభిశస్తులయశ్రుకణము, లవని రాలిన నవియు భోగార్ధ ముర్వి
పాలనము సేయునరపతిపశుకళత్ర, మిత్రపుత్రుల హింసించు మిథ్య గాదు.

1929


సీ.

అల బాలవృద్ధవైద్యులను బూజింతువే తడయక వాఙ్మనోదానములను
గురువుల వృద్ధుల సురలఁ జైత్యంబుల నతిథుల సిద్ధార్థు లైనవిప్ర
వరులను మౌనులఁ బరికించి నిత్యంబు గురుతరభక్తి మ్రొక్కుదువె నీవు
ధర్మ మర్థంబుచే ధర్మంబుచే నర్థ మవి రెండు నిఖిలభోగాభికాంక్షఁ


తే.

గామమునఁ జాలఁ జేడ్పాటు గాక యుండఁ, గాతువే మఱి ధర్మార్థకామములను
వేఱు వేఱ విభాగించి వీరవర్య, కడమ పడకుండ సేవింతె కాలమందు.

1930


తే.

అఖిలశాస్త్రార్థకోవిదు లైనద్విజులు, పాడి దప్పక నిత్యంబుఁ బౌరజాన
పదులతోఁ గూడి నీకు శుభంబు గలుగు, నట్లు ప్రార్థింతురే నిత్య మనఘచరిత.

1931


వ.

మఱియు నాస్తిక్యంబును ననృతంబును గ్రోధంబును ననవధానత్వంబును దీర్ఘ
సూత్రత్వంబును సాధుజనాదర్శనంబును నాలస్యంబును బంచేంద్రియపరవశత్వం
బును బ్రయోజనంబుల నేకచింతనంబును విపరీతార్థబోధకులతోడ మంత్ర
ణంబును నిశ్చితార్థంబులం దనారంభంబును మంత్రంబు రక్షింపకుండు
టయు మంగళంబు లనుష్టింపకుండుటయు సర్వదిగవస్థితశత్రురాజుల నుద్దే
శించి యేకకాలంబున దండయాత్ర సలుపుటయు నివి పదునాల్గు రాజ
దోషంబులు మహీపతి వీని నన్నిటిని వర్జింపవలయు మఱియు లోభక్రోధా
లస్యాసత్యప్రమాదభీరుత్వాస్థిరత్వమూఢత్వానయావమంతృత్వరూపర
శవర్గంబును మృగయాద్యూతదివాస్వప్నపరివాదస్త్రీమదనృత్తగీతవాద్య
వృథాపర్యటనంబు లనియెడుదశకామజగుణంబులును సాపత్నవస్తుజస్త్రీజవా
గ్జాతాపరాధజంబు లనియెడుపంచవిధవైరంబులును నౌదకపార్వతవార్క్షైరిణ
ధాన్వనంబు లనియెడుపంచవిధదుర్గంబులును సామదానభేదదండంబు లని
యెడుచతురుపాయంబులును నౌరసతంతుసంబంధవంశక్రమాగతవ్యసనరక్షి
తు లనియెడుచతుర్విధమిత్రంబులును న్యాయధనార్జనరక్షణవర్ధనసత్పాత్ర
ప్రతిపత్తు లనెడుచతుర్విధరాజవృత్తంబులును స్వామ్యమాత్యరాష్ట్రదుర్గకోశ
బలసుహృత్సంజ్ఞలం గలపరస్పరోపకారిసప్తాంగంబులును నిజమైత్రసమా
శ్రితసుబంధుజకార్యసముద్భవభృత్యగృహీతనామకంబు లగుసప్త
విధపక్షంబులును శ్యేనసూచిగరుడశకటమకరక్రౌంచపద్మంబు లని
యెడుసప్తవిధప్రధానవ్యూహంబులును గృషివాణిజ్యదుర్గసేతుకుంజర
బంధనఖన్యాకరకరాదానశూన్యనివేశనంబు లనియెడునష్టవర్గంబులును
బైశున్యసాహసద్రోహేర్ష్యాసూయార్థదూషణవాక్పారుష్యదండపారుష్యం