Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షాపరతంత్రుఁ డుగ్రబలశాలి గుహుం డనుపేరివాఁడు ప్రా
ణోపమమిత్రుఁ డై తగురఘూత్తమురాక యెఱింగి సన్ముతో
ద్దీపితుఁ డై హితాళి చనుదేర భజింపఁగ వచ్చె రామునిన్.

1016


ఉ.

ఈగతి నేగుదెంచుగుహు నెంతయు నంతనె చూచి చాప
దీక్షాగురుఁ డైనరాముఁడు ప్రసన్నముఖుం డయి రమ్ము రమ్మన
న్వేగమె డాయ వచ్చి కడువిశ్రుతకీర్తిని రామమూర్తినిం
గౌఁగిటఁ జేర్చి మేనఁ బులక ల్సెలఁగ న్వినయోక్తి ని ట్లనున్.

1017


ఆ.

ఓ మహానుభావ యేమి కారణమున, నీతపస్విరూప మిపుడు గలిగె
సఖుఁడ నైననాకు సర్వంబు దయతోడఁ, జెప్పు మధిప వేఱు సేయనేల.

1018


క.

పాయక మద్భాగ్యంబున, నీయట్టిప్రియాతిథి న్వినిర్మలచరితున్
న్శ్రీయుతునిఁ జూడఁగలిగెను, నాయట్టికృతార్థుఁడు భువనంబులఁ గలఁడే.

1019


వ.

అని స్వాగతం బడిగి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి వెండియు ని ట్లనియె.

1020


మ.

ఇనవంశోత్తమ యీధరిత్రికిఁ గరం బీశుండ వీ వేము నీ
కనిశంబుం బని సేయువారము మదీయం బైనరాజ్యంబు గ్ర
ద్దనఁ జేపూని ధరింపు మీపుర మయోధ్యాపట్టణంబట్ల వే
డ్క నిరీక్షింపుము భక్ష్యభోజ్యములు వే గైకొమ్ము నాపై కృపన్.

1021


మ.

అని ప్రార్థించుచు నున్నయాగుహుని రాజాగ్రేసరుం డైనరా
మనరేంద్రుండు దయార్ద్రదృష్టిఁ గని సమ్మానంబుఁ గావించి యి
ట్లనుఁ బుణ్యాత్మక యేము సంతతము నుద్యత్ప్రీతి నీచేత న
ర్హణముం బొందినవార మింత యిపు డేలా నూత్నసంబంధముల్.

1022


వ.

అని మైత్రిం బ్రకటించి మృదుపీనంబు లైనబాహువులం బరిష్వజించి వెండియు
ని ట్లనియె.

1023


చ.

అనుపమపూర్వజన్మసుకృతాతిశయంబున నిన్ను నేఁడు లో
చనములు చల్ల గాఁగఁ గని చాలఁ గృతార్థుఁడ నైతి నీసుతుల్
తనయలు చుట్టము ల్సఖులు దాయలు సైన్యపతు ల్కరు ల్హరుల్
ఘనముగ సంతతంబును సుఖస్థితి నొప్పుదురే సుహృద్వరా.

1024


చ.

అనఘవిచార నీ కొసఁగు నట్టిసపర్యలు మాకు నచ్చె మ
జ్జనకునియాజ్ఞచే నియతి సంధిలఁ దాపసవృత్తిఁ గానలోఁ
బనివడి సత్వ్రతంబు సలుపం జను నే నిట భక్ష్యభోజ్యము
ల్గొనుట యసంగతంబు నయకోవిద యీవినయంబు చాలదే.

1025


వ.

ఈతురంగమంబులు మార్గాయాసంబున డస్సి యున్నయవి ఘాసపానీయం
బులచేత వీనికిం దృప్తిఁ గావింపుము నన్నుం బూజించినట్ల కా సంతసించెద
ననిన నట్ల యని తగువారల నశ్వరక్షణంబునకు నియోగించి నంత నారఘు