పుట:Gopinatha-Ramayanamu1.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంబులును నరణ్యకాండమునందు రెం డక్షరంబులును గిష్కింధాకాండము
నందు రెం డక్షరంబులును సుందరకాండంబునందు మూఁ డక్షరంబులును యుద్ధ
కాండమునం దా ఱక్షరంబులును నుత్తరకాండంబునందు నా ల్గక్షరంబులును
సంస్థాపించి రచించె నిక్కావ్యంబు చతుర్వింశత్యక్షరాత్మకగాయత్ర్యాఖ్యవర
బ్రహ్మనివాసం బై యుండు నుత్తరకాండంబునందు సమస్తజనులకు భగవంతు
నితోఁ గూడఁ దల్లోకప్రాప్తి యతిశయం బై యుండుటం జేసి యిక్కావ్యంబు
ప్రాచుర్యంబుగాఁ బరత్వాభివ్యక్తి కలిగియుండు దానం జేసి సర్వోత్తరత్వంబు
వలన నిది యుత్తరకాండం బనం బరఁగె నివ్విధంబున రామాయణంబు సమ
గ్రంబుగా రచియించి.

155


క.

మునిపతి కృతార్థుఁ డై తా, నొనరించిన రామచరిత మొప్పారఁగ నె
వ్వనిచేఁ జదివించెదనో, యని మదిఁ దలపోయుచుండ నాసమయమునన్.

156

వాల్మీకిమహర్షి శ్రీరామాయణమహాకావ్యముఁ గుశలవుల కుపదేశించుట

సీ.

రూపవంతులు తుల్యరూపులు తుల్యవయస్కులు ధర్మకామార్థవిదులు
సుకుమారమూర్తులు సుందరాంగులు యశస్కరు లన్నదమ్ములు చారుముఖులు
లలితలక్షణలక్షితులు మధురస్వరభాషులు గంధర్వవేషధరులు
శ్రుతినిష్ఠితులు బహుశ్రుతులు మేధావులు మునివేషధరులు సంపూర్ణతేజు


తే.

లఖిలగాంధర్వతత్త్వజ్ఞు లఖిలశాస్త్ర, విదులు మూర్ఛనాస్థానకోవిదులు రాజ
నందనులు సర్వసంపన్ను లిందుసదృశ, లపనులు కుశీలవులు కుశలవులు వచ్చి.

157


తే.

భక్తి వాల్మీకిమునినాథుపాదములకు, వందనముఁ జేసి పేశలవాగ్విభూతి
మమ్ముఁ జదివింపుఁ డనవుఁడు మౌనివిభుఁడు, కరుణ దళుకొత్త వారల గారవించి.

158


తే.

పరఁగ రామదేహాఖ్యబింబంబువలన, సముదితము లైనయపరబింబములరీతి
నమరువారి మనోజ్ఞవేషములవారి నక్కుమారోత్తములఁ జాల నాదరించి.

159


మ.

సమతంత్రీలయయుక్తమై మధుర మై సప్తస్వరోపేత మై
రమణీయామృతకల్ప మై నవరసప్రాగల్భ్య మై సన్మనో
రమ మై యొప్పెడురామచంద్రచరిత ప్రత్యగ్రకావ్యంబు స
ర్వము సార్థంబుగ నక్కుమారులకు నవ్వాల్మీకి సెప్పె న్రహిన్.

160


తే.

చెప్పినఁ గుశీలవులు ముదఁ మొప్ప మౌని
కరుణ నక్కావ్య మంతయు వరుసఁ జదివి
రమణ సర్వంబు వాగ్విధేయముగఁ జేసి
తావసకులోత్తమునిప్రసాదంబు వడసి.

161


మ.

మదనాకారులు రాజనందనులు సమ్యగ్గానవిద్యారహ
స్యధురీణు ల్మధురస్వరు ల్గవలు చందన్మూర్ఛనాస్థానకో
విదు లై రామకథాప్రబంధము లసద్వీణానుకూలంబుగా