69.
లేమల్లెపాడు
కయిఫియ్యతు మౌ॥ లెమల్లెపాడు సంతు గుంట్టూరు తాలూకె
చిల్కలూరిపాడు యిలాకె రాజామానూరు వెంక్కకృష్ణారావు
మజుంద్దారు గారు.
యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చి లేమల్లెపాడు అనే వాడికె వున్నది.
గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజు ప్రభుత్వం చెశెటప్పుడు శాలివాహనం ౧౦౩ఽ (1145 A. D.) శక మంద్దు బ్రాంహ్మణులకు గ్రామ కరిణిమ మిరాశిలు యిచ్చెయడల యీ గ్రామాన్కు వెలనాడు ఆతిసగోతృలు .. పల్లి వారు అనేటి... యొక్క కోదండ్రాముడు అనె అతనికి కావు మిరాశిలు యిచ్చినారు గన్కు తదారభ్య తద్వంశీకులు అనుభవిస్తూ వుంన్నారు. వడ్డెరెడ్డి కన్నా౯టక ప్రభుత్వములు జరిగిన తర్వాతను శా ౧౫౦౨ శకం (1580 A. D.) లగాయతు మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు పాదుశహాలు యీ కొండ్డవిటి శిమ సర్కారు సముతు బంద్ధిలు యెప౯రిచి బారాముత సద్ధిహోదాలు నిన్న౯ యించ్చెయడల యీ గ్రామం గుంట్టూరు సముతులొ దాఖలు చెశి సముతు ఆమీలు దేశపాండ్యాల పరంగ్గా బహుదినములు అమానిమామిలియ్యతు జరిగించ్చినారు.
స్న ౧౧౨౨ ఫసలీ (1712 A. D.) లో కొండ్డవిటి శిమ మూడు పంట్లుచేశి జమీదాల్ల౯కు పంచిపెట్టెయడల యీ గ్రామం సర్కారు మజుందారులయ్ని మానూరి వెంకన్నగారి వంట్టులో వచ్చి చిల్కలూరు పాడు తాలుకాలో దాఖలు అయ్నింద్ను వెంకంన్న పంత్తులుగారు అప్పాజీ పంత్తులుగారు స్న ౧౧౪౩ (1733 A. D.) ఫసలి పర్కు ప్రభుత్వంచెశ్ని తర్వాతను వెంక్కటరాయనింగారు ప్రభుత్వాన్కు పచ్చి యిచ్ని యినాములు
కు గండ్లికోట... లింగ్డం గారికి...... ౧4౦ కి శంబ్బి వరదాచార్యులు గారికి ౦ 4౦ గ్రామకరణం 40 పౌరొహితుడు భాగవతులు...... ౦ 40 గ్రామచర్వుకు మారామతు ౦ | ౦ ...భట్లు నరసంన్నగార్కి ౩౦ యినాములు యిప్పించి సదరహీ ఫసలీ లగాయతు న్న ౧౧౬ ఫసలీ (1759 A.D.) వరకు ప్రభుత్వం చేసెను.