పుట:Dvipada-Bagavathamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ద్విపదభాగవతము

హరిరాములకు జయంబయ్యెడుననుచు
సురలు దీవించిరి, శోకించి పౌరు

శ్రీకృష్ణబలరాములఁ గాంచి పౌరులు శోకించుట


“లక్కటా! ఈకంసుఁ డతిపాపకర్ముఁ
డెక్కడి యీబాలు రెక్కడి వీర
లెక్కడననిఁ జూడ కెట్లు గావించె
నక్కటా! వారించరైరి యెవ్వరును.
ఈసుకుమారుల నిటు సేయఁ దనకు
దోసంబుఁ దిట్టును దూరును గాదె?
పరుషత రిపులతో బవరంబు నేయ
హరిమేను ఘర్మకణాంచితం బగుచు
[1]వివశితాంభోజంబువిధ మొందెఁ జూడు
డీవాసుదేవుల కీబారిగడపు
దైవమాయని" మ్రొక్కి తరుణులు వగువ;
దేవకియును వసుదేవుఁడుఁ బ్రీతి
గోవిందబలులఁ గనుఁగొని వంతనొంది

శ్రీకృష్ణుఁడు చాణూరుని జంపుట


రప్పుడు దనుజారి యామహాజట్టి
దప్పకఁ జూచి యుద్ధత శక్తి మెఱసి210
పిడికిటఁ బొడిచినఁ బెంపేది వాఁడు
పడియొడ్డ నిల్చి యపంకజోదరుని
వక్షంబు శిరమున వడిదాఁకుటయును;

  1. ఈ పద్యపాద మొక్కటియే కన్పడుచున్నది.