పుట:Dvipada-Bagavathamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

147

శ్రీకృష్ణబాణాసురుల ద్వంద్వయుద్ధము


చండాంశుదశకర చటులంబులగుచు
మండితదోర్ధండమహిమ దీపింప
శ్రీరమ్యతర మేరుశిఖరమో యనఁగ
చారుకిరీటనిశ్చలకాంతి నిగుడ
లలితాంబుధరతటిల్లతికలో యనఁగ
బలిసి యుగ్రాయుధప్రభలుప్పతిలఁగఁ
దాఁకునఁబూర్ణ సుధాంశుచే నైన
ప్రాకట ముక్తాతపత్రంబు వెలుఁగఁ
బ్రథమాద్రిఁ దోతెంచు భానుఁడో యనఁగ
రథమెక్కి గర్వదుర్వార వేగమున
హరిమీఁద జనుదేర నతని కేతనము
మురిసి కూలుటయును ముదమంది(మదిని)940
“కలిగెఁ గదా! నాకుఁ గదనరంగమునఁ
గలుషంబుతోఁ జేతిగమి తీఁటమాన్ప”
నని మురారాతిపై నంబకాష్టకముఁ
జొనుపుటయును శౌరిచూచి కోపించి
పటుశార్ఙనిర్ముక్తబాణజాలముల
విటతాటముగ దైత్యవిభునేయ నతఁడు;
యేనూఱు చేతుల నేనూఱు విండ్లు
బూని నానాస్త్రముల్ పొరినేర్చి నారిఁ
దొడిగి పల్లేసినఁ దొలఁగక వాని
నడుమనే తునుమాడె నలినలోచనుఁడు
తొడిబడ విండ్లన్ని దునిమి రథములఁ
బొడిసేసి సారథి బొడవడగించి