పుట:Dvipada-Bagavathamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

95

నామణి ధరియించి యశ్వంబు నెక్కి
కామించి యడవి కొక్కఁడు వేఁట వెడలి
మృగముల నొంప నమ్మేదినీవరుని
మృగరాజు చంపి యామిషశంక నతని
మెడనున్న రత్న మర్మిలిఁ గొంచు కొండ
పడలోని కరుగంగ భల్లూకవిభుఁడు
యా కేసరినిఁ ద్రుంచి యామణిఁ గొంచుఁ
బ్రాకటంబుగ మహాభవనంబు సొచ్చె.
అంత సత్రాజిత్తుఁ డనుజుఁడు రామి
కెంతయుఁ జింతించి యిచ్చలో వగచె.

సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట


“కటకటా! అడవి కొక్కరుఁడునుఁ బోయెఁ
గుటిలత నెవ్వరు కూల్చిరోగాక!
తనకు నమ్మణి యీని తప్పున శౌరి
మనప్రసేనుఁ బట్టి మడియింపఁబోలు!
అతఁడేల లోబడు నన్యులచేత?
ఇతరులీసాహసం బేల కావింత్రు?
అడిగిన యీ నేరకనుజన్ముఁ గోలు
పడితినక్కట!" అని పలవింపుచుండ
విని పౌరులెల్లను విష్ణుని దలఁచి
యనుమానపడుచుండ నామాట లెఱిఁగి360
యపరిమితజ్ఞాని యగు శౌరి యట్టి
యపకీర్తి నెబ్భంగి నడఁగింతు ననుచు