పుట:DivyaDesaPrakasika.djvu/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్యాలి - 54

ఇది అతి పురాతనమైన సన్నిధి. స్వామి జగన్మోహినీ కేశవస్వామి, పరమశివునకు ప్రత్యక్షము.

విశే: మోహినీ అవతారమును చూచి మోహించిన పరమశివునకు తన నిజస్వరూపమును ప్రదర్శించిన స్థలము. కావుననే స్వామి ముందుభాగము కేశవుడుగా, వెనుకభాగము జగన్మోహినిగా వేంచేసియుందురు. ఈదృశ్యము అతిమనోహరమైనది. స్వామి శ్రీపాదముల నుండి సదా గంగా ప్రవహించు చునేయుండును. మకరతోరణముపై దశావతారములు కలవు.

మార్గము: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు 10 కి.మీ దూరము.

జగన్మోహినీ కేశవ స్వామి(ర్యాలి)

JAGANMOHINI KESAVA SWAMY(RYALY)

175