పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

అంగరక్షణము


బాహువుల్ ప్రోచు గోపాలకశ్రేష్ఠుండు
        కూర్పరంబులు గాచుఁ గుశలదాయి,
మణిబంధముల నేలు మణిమయాభరణుండు
        కరతలంబులఁ గాచు ఖరవిరోధి,
గళము సంరక్షించు గంభీరవాహుండు
        చుబుకంబుఁ గాచు యశోధనుండు,
గండయుగ్మము బ్రోచుఁ గల్యాణశీలుండు
        శ్రుతులఁ బాలించు విశ్రుతయశుండు,
ఘ్రాణ మేలు బహుప్రకారఖేలనశాలి
        నయనముల్ గాచు దుర్నయవిదారి,
భ్రూయుగ్మ మేలు సంపూర్ణతేజోనిధి
        ఫాలస్థలముఁ గాచుఁ బావనుండు,
మూర్దంబు పాలించు మునిమనస్సదనుండు
        పృష్ఠభాగము నేలుఁ బృథుబలుండు


గీ.

అగ్రభాగముఁ గాచు సర్వాగ్రగణ్యుఁ
డుభయపార్శ్వంబులను బ్రోచు నూర్జితుండు
ప్రోచు బహిరంతరము లాదిపూరుషుండు
మదిని బాయక నిలుచును మాధవుండు.

280


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబులు పఠింపుచు మంత్రకవచంబున నవ
యవంబులు సురక్షితంబులు గావించి యథావిధిన్ ధనురాచార్యుం
బూజించి పండ్రెండుమారులు ప్రణామం బాచరించి యానతపూర్వ
కాయంబుగాఁ దత్సన్నిధి భయవినయంబులు రెట్టింప నిలిచి యిట్లని
ప్రార్థింపం దగు.

281


సీ.

ఏవిద్యపెంపున నీశానదేవుండు
        త్రిపురసంహారంబు ధృతి ఘటించె,
నేనేర్పుపెంపున సేనాధినాథుండు
        శూరపద్మాదుల బీర మణఁచె,