పుట:Delhi-Darbaru.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

హైదరాబాదు సంస్థానము.


దండులసమకూర్చెను... 1875వ సంత్సరము వేల్సు ప్రభువుగారి దర్శనమునకుఁ బోవనిస్టము లేమిని సూచించుటయు, యుద్దోపక రణములు రహస్యముగ చేయించుచుంట బయల్పడుటయు, తన సహ పాలకుఁడు మృతినొందగ మఱియొక సహపాలకుఁడు నేమిం పఁబడుట కూడదని పట్టుపట్టుటయు నతని మనోగతిని దెలియఁ బఱచు చున్నవి. ఫత్రికలమూలమున నేమి గొప్ప అధి కారులమూ లమున నేమి మఱియితరుల మూలమున నేమి భారతవర్ష ప్రభుత్వ మువారిని వంచింపఁ జేయఁబడిన ప్రయత్నము లతని యనుజ్ఞ మీఁదనడచెను. ఈ కారణములను బట్టియు మఱియితర కారణ ములను బట్టియు రాజప్రతినిధిగ, అనఁగా గవర్నరుజనరలుగా, నుండిన లార్డులిట్టను తన ప్రతినిధిత్వమున యుద్ధమున కంటెను క్షామమునకంటెను నెక్కు డపాయకరమగునది ఈమంత్రి యొక్క కుట్ర లేయని సంకోచింఫక నుడివియున్నాఁడు. ఈతన యభిప్రాయముల నెరవేర్చుకొను నుద్దేశముతో బీరారును మరల్పుఁడనియు నైజాము సైన్యమును బగులఁగొట్టుఁడనియు ఆంగ్లేయులతో నొక్కి చెప్పుటకొఱకు స్వంత సంతోషమున కై యని నిమిత్తముగల్పించుకొని సర్ సాలారుజంగు 1876 న సంవత్సరమున నింగ్లాండునకు బయనమయి పోయెను. హైద రాబాదు నెడల నాంగ్లేయ ప్రభుత్వమువారి చర్యలన్నిటిని ఖం డించుచు నతఁడు వ్రాసిన దానిని నార్తుటూబ్రూకు ప్రభువును ఇంగ్లాండు ప్రభుత్వము వారును చక్కఁగ విమర్శించిరి. ఇండియా