పుట:Dashavathara-Charitramu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

దయ వర్ణాశ్రమధర్మరక్షణము నౌదార్యంబు దాక్షిణ్యము
న్నయముం గల్గిన క్షత్త్రవంశజులచెంత న్నిల్వ కీవెందు ని
ర్దయులౌ మ్లేచ్ఛులఁ దుచ్ఛజాతుల సముద్యత్ప్రీతి వర్తింపు దు
ర్నయులం చెన్నకు లక్ష్మి వారలెకదా నాప్రాణబంధు ల్మహిన్.

7


క.

శిష్టాచారులు లేమిని, కష్టాత్ములఁ జేసి వెనుకఁ గార్పణ్యముచే
భ్రష్టులఁ జేయుము నీ విఁక, జెష్టా పోపొమ్ము సీమసీమలమీఁదన్.

8


సీ.

శాబరమంత్రము ల్సఫలంబులుగఁ జేయు వేదమంత్రము లెల్ల వృథ యొనర్పు
మెన్నెన్నివిధముల హీనజాతులనుండు ముత్తమద్విజులందు నుండవలవ
దుండిన బ్రతుకు నీ కుపయోగముగ నుండు సద్ధర్మభక్తులు సాగనీకు
వివిధశాస్త్రార్థము ల్విశ్వసింపఁగ నీకు ధర్మశాస్త్రంబులు దలఁపనీకు


తే.

కామశాస్త్రంబు ముఖ్యంబుగా ఘటింపు, బౌద్ధచార్వాకజైనకాపాలికాది
మతము లెచ్చింపుము శ్రుతియుతము లుడుపు, తిరుగు మెల్లెడ శారదాదేవి నీవు.

9


వ.

అని మఱియు వారివారిం దగునుద్యోగంబుల నియోగించి శూద్రనృపలక్ష
ణంబుల ముద్రితుండగు కలి మదోద్రేకంబున రౌద్రసమున్నిద్రుం డగుచు
ధర్మపురుషుని కొదవపాదంబు గెంటింప కంటికి నిద్ర రాదని వెదకుచు భాగీ
రథీతీరంబున గోరూపధారిణియగు ధారిణింగూడి నడయాడు ధర్మవృషభంబుఁ
బ్రసభంబునం దన్ని తన్నిరాకరణకుపితభవజ్జనకపరీక్షత్ప్రతిహతుండై తదను
మతంబున స్త్రీద్యూతపానాదుల వసించియున్నవాఁ డింకం గొంతకాలంబు
భవాదృశులగు రాజులకు వెఱచి యీమేర వర్తించు నంత యథేచ్ఛం బ్రవ
ర్తించుఁ దత్క్రమంబుఁ గొంత వినుపించెద నాకర్ణింపుము.

10


క.

జనపతు లన్నము భూసుర, జనములు వేదములు సతులు స్మరగేహములం
బనివడి యమ్ముదు రింకన్, వినువిూ కలియుగము దుష్టవృత్తి నరేంద్రా.

11


క.

ధన మిచ్చు నతఁడె యేలిక, ధన మిచ్చినవాఁడె మగఁడు తరుణులకెల్లన్
ధనవంతు నాశ్రయింతురు,ధనము ప్రధానంబు దుష్టతరకలివేళన్.

12


క.

క్రతుధానవ్రతములకుం, బ్రతివిధు లొనరించికొంద్రు బ్రాహ్మణకులు లే
శ్రుతులు పఠింపరు గీతా, శ్రుతి చదువుదు రదియుఁ బోవు సురనదితోడన్.

13


సీ.

క్షితిని ధర్మంబు మించిన లేదు వాన వానలు లేమి షామంబు బలియు లెస్స
క్షామంబు ప్రబలినఁ గడిచేసి యన్నంబు భుజియింప దొరకమిఁ బ్రజలు నొగిలి
యడవులఁ బడి యాకునలము మెక్కుచు నెవ్వఁడే నపూర్వంబుగా నున్న కాయ
పండు దిన్నను వాని బట్టుక యుదరంబు చించి లోపలిది భక్షించికొనుచు


తే.

హ్రస్వదేహులు హీనాంగు లల్పధనులు
క్రూరు లశనైకతత్పరు ల్కుటిలమతులుఁ