పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి

141

గీ. యనుచు ని న్నవనీపతు లహరహంబు
    సరగ గంభీరవాక్ప్రౌఢి సన్నుతింతు
    రబ్జధీమణితనయ! శబ్దార్థనిలయ
    తాస్థిరాత్మక! వెల్లంకితాతసుకవి!

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి

ఈమేటికవి క్రీ.1480ప్రాంతము నాంధ్రదేశమునఁ బ్రఖ్యాతికెక్కినవాఁడు. శృంగారశాకుంతలము, జైమినిభారతము నను రెండుకృతులు మాత్ర మీతనివి లభించుచున్నవి. విద్యానగరమును బరిపాలించిన సాళ్వగుండ నరసింహరాజునకు జైమినిభారతము కృతిగా నొసఁగఁబడినది. నరసింహరాజునకు కృతి రచించి కొనివచ్చుట కేర్పఱిచిన గడువునాఁటివఱకు నీతఁడు గ్రంథరచన మారంభింపనే లేదనియు నాఁడు తద్బంధుజనులు కృతి రచింపవైతితి. రాజువలనఁ జిక్కు వచ్చునని మొఱపెట్టఁగా నారాత్రి యింటిలో నొకగది యలికించి మ్రుగ్గు వెట్టించి తాటియాకులును గంటమును గొని తానొక్కరుఁడ యందుఁ బ్రవేశించి సరస్వతీసాహాయ్యమునఁ దెల్లవారువఱకుఁ గృతిని సమకూర్చి మఱునాఁడు రాజాస్థానమున వినిపించి ‘వాణి నారాణి’ యనెననియు నొకకట్టుకథ కలదు. అంత శీఘ్రకాలములో నతిరసవంత మగునాకృతి నాతఁడు రచించుట సత్యమయియుండును. పైకథకుఁ దోడుగా నీపద్య మొకటి కలదు—

క. పిల్లలమఱిపినవీరన
    కిల్లా లట వాణి యట్టులే కా కున్నన్