కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు
125
దాలిమిని వాలుఁజూపుల
బాలామణి గుట్టు బైటఁబడఁగాఁ జూచెన్.
కొండవీట నున్నప్పు డెడనెడఁ బల్నాటిసీమకు శ్రీనాథుఁడు పోవుచుండెడివాఁడు. పల్నాటిసీమపై నీతనికిఁ గల యనాదరము ననేకపద్యములఁ బట్టి తెలిసికొననగు. పల్నాటివారికిఁ గారెమపూఁడి కాశి యట.
ఉ. వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుఁడు కళ్ళిపోతురా
జారయఁ గాలభైరవుఁడు నంకమశక్తియ యన్నపూర్ణయున్
గేరెడుగంగధారమడుఁగే మణికర్ణిక గాఁ జెలంగు నీ
కారెమపూఁడిపట్టణము కాశిగదా పలినాటివారికిన్.
పల్నాటిసీమపై నీతనికిఁ గల యనాదరము—
క. రసికుఁడు పోవఁడు పల్నా
డెసఁగంగా రంభయైన నేకులె వడుకున్
వసుధేశుఁడైన దున్నును
గుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.
పల్నాటిసీమలో నెంతోలోఁతు త్రవ్వినఁగాని నీళ్ళూరవు. అక్కడి చేఁత్రాళ్ళు కొండవీటిచేఁత్రాళ్ళకు ద్విగుణితములై యుండవలయును. అంతలోఁతు త్రవ్వినను గొన్నిచోట్లు నీరూరక రాతిచట్టులు వచ్చును; కాన నీళ్ళకై యెంతోసొమ్ము భంగపడవలసి వచ్చుచుండును. ఈవిషయమునఁ జెప్పిన పద్యము—
ఉ. అంగడి యూర లేదు వరియన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైనవనంబులు లేవు నీటికై
భంగపడంగఁ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన పలినాటికిఁ మాటికిఁ బోవ నేటికిన్?