పుట:Bibllo Streelu new cropped.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేడుకొంది. శిష్యులుకూడ ఆమె తరపున ప్రభువుకి సిఫార్సు చేశారు. క్రీస్తు ఇంటిలోని బిడ్డల రొట్టెను కుక్కలకు వేయకూడదన్నాడు. అనగాసొంతజాతి ప్రజలైన యూదులను వదలివేసి అన్యజాతి ప్రజలయూదులు స్త్రీలను పనికత్తెలనుగా కొరగాని వాళ్లనుగా భావించే వాళ్లు. కాని క్రీస్తుమాత్రం వాళ్లను విలువతో జూచాడు. ఓసారి అతడు కానుకల పెట్టెవద్ద కూర్చుండి భక్తులు పెట్టెలో కానుకలు వేసే తీరును గమనిస్తున్నాడు. ఉన్నవాళ్లు దానిలో పెద్దమొత్తాలే వేశారు. అంతలో ఓ పేద విధవ వచ్చి రెండు పైసలు మాత్రమే వేసింది. క్రీస్తు ఆమె త్యాగాన్ని మెచ్చుకొన్నాడు. ఈమె అందరికంటె ఎక్కువగా దానం జేసింది. తన జీవనాధారమంతా త్యాగం చేసింది అన్నాడు. ఆమె ఎవరికంటా బడకుండా, ఎవరి మెప్ప పొందకుండా దాటిపోయింది. కాని క్రీస్తు మాత్రం ఆమెను మెచ్చుకొన్నాడు -మార్కు 12,41-44.


బెతనీ గ్రామంలో పాపాత్మురాలు పరిమళ తైలంతో ప్రభువు పాదాలు అభిషేకించింది. అక్కడి వాళ్లకు ఆ కార్యం నచ్చలేదు. వాళ్లు ఇంత పరిమళ ద్రవ్యాన్ని వృథాగా వ్యయంజేయడం దేనికి? దీనినమ్మి పేదవాళ్లకు దానం చేయవచ్చుగదా అన్నారు. కాని క్రీస్తు ఆ భక్తురాలి కోపు తీసికొన్నాడు. "మీరు ఈమెను పీడించడం దేనికి? ఈమె నా భూస్థాపనాన్ని సూచిస్తూ నన్ను అభిషేకించింది. ఈ సువార్తను బోధించే తావులన్నిటిలోను ప్రజలు ఈమె పుణ్యకార్యాన్ని గూర్చి చెప్పకొంటారు" అన్నాడు - మార్కు 12,41-44.

ఓసారి అన్యజాతికి చెందిన స్త్రీ వొకతె వచ్చి తన బిడ్డకు పట్టిన దయ్యాన్ని పారదోలమని క్రీస్తుని కు సేవలు చేయడం భావ్యం కాదని భావం. కాని ఆమె వినయంతో అయ్యా! భోజనపు బల్లమీదినుండి పిల్లలు పడవేసే రొట్టెముక్కలను ఆ బల్లక్రింది కుక్కపిల్లలు తింటాయి కదా అంది. అనగా మీరు మొదట యూదులకే సేవలు చేయండి. అటుతర్వాత అన్యజాతి జనులమైన మాకు గూడ మీ సేవలు అందించండి అని భావం. ప్రభువు L