ఈ పుట అచ్చుదిద్దబడ్డది
1. మరణం
చావులో మన దేహాత్మలు తాత్కాలికంగా విడిపోతాయి. దేహం మొదట మట్టిలో
కలసిపోతుంది. లోకాంతంలో మళ్లా వుత్థానమౌతుంది. ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది. చావు మామూలుగా భయాన్ని కలిగిస్తుంది. ఈ భయాన్ని జయించడం అత్యవసరం. ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దా0.
1. యాత్రిక దశ నుండి శాశ్వత దశకు
మరణం వచ్చేదాకా మనం యాత్రిక దశలో వుంటాం. ఈ లోకంలో జీవితయాత్ర
సాగిస్తూటాం. కాని మరణంతో శాశ్వతదశలో అడుగిడతాం. ఇక యుహలోక
జీవితమంటూ వుండదు. మనం ఏన్నాళ్ల జీవించినా చనిపోక తప్పదు. బైబులు ఆయా వ్యక్తుల మరణాలను వర్ణించేపుడు "వాళ్ళ తమ పూర్వులను కలసికొన్నారు" అని చెప్తుంది, అబ్రామాము దీర్ఘకాలం జీవించి పండు ముసలితనాన రాలిపోయి తన పూర్వులను గలసికొన్నాడు–ఆది 25,8 ఇంకా చనిపోవడమంటే “మట్టిలో కలిసిపోవడం” గూడ, పాపం చేసిన ఆదాముకి దేవుడు నీవు మట్టినుండి పట్టావు గాన చివరికి మట్టిలోనే కలసిపోతావని శాపం పెట్టాడు - ఆది 3,19. కనుక నరుడు ఎన్నాళ్ళు బ్రతికినా కడకు మరణించక తప్పదు. మనం మరణించిన తర్వాత మళ్ళా పశ్చాత్తాపపడి పూర్వ పాపజీవితాన్ని మార్చుకోలేం. వరప్రసాదమూ పుణ్యమూ ఆర్ధించలేం. చనిపోయేపుడు ఏదశలో వుంటామో ఇక ఆ దశలోనే శాశ్వతంగా ఉండిపోతాం. ఈ జీవితంలో మన ఆత్మ భౌతిక దేహంమీద ఆధారపడి జీవిస్తుంది. ఈ దశలో అది ఎప్పటికప్పుడు మంచికి గాని చెడ్డకుగాని మారగలదు. తన నిర్ణయాలను మార్చుకోగలదు. కాని మరణంతో ఈ దేహం తొలగిపోతుంది. ఆత్మ వంటరిగా జీవించడం మొదలుపెడుతుంది. అది ఈ భౌతికకాలంలోగాక, ఆ కాలానికి వెలుపల జీవిస్తుంది. ఇక దానిలో మార్పుంటూ ఉండదు. కనుకనే అది మరణానంతరం పూర్వ పాపాలకు పశ్చాత్తాపపడలేదు. క్రొత్తగా పాపపుణ్యాలను కట్టుకోలేదు కూడ. చాలమంది ఈ ప్రపంచ జీవితంలో కుత్తిక వరకు మునిగి ఉంటారు. ఆ పరలోక జీవితాన్ని గుర్తుకి తెచ్చుకోనే తెచ్చుకోరు. కూడు గుడ్డ యిలు వాకిలి సంపాదించుకోవడం డబ్బు జేసికోవడం పేరు గడించడం మొదలైన వ్యామోహాల్లో తగుల్కొని శాశ్వత సత్యాలను విస్మరిస్తారు. ఇది పొరపాటు, నీడలాగ, నీటి బుడగలాగ, మనం విడిచే శ్వాసలాగ, ఈ జీవితం క్షణికమైంది. ఎన్నాళ్లు జీవించినా ఏమేమి సాధించినా నరులు
252