పుట:Bhoojaraajiiyamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

43


భూమిధాన్యరత్న హేమగోమహిషాశ్వ
వస్త్రభూషణాది వస్తుచయము.

94


ఉ.

అంతఁ బ్రసూనగంధవివిధాభరణాదులు దాల్చి యమ్మహీ
కాంతుఁడు రాజచిహ్నలఁ బొగడ్త వహించి సమస్తమంత్రిసా
మంతపురోహితాప్తభటమండలి గొల్వఁగ వేత్రహస్తు లం
తంతన చూచి పాయుఁ డనునట్టి యెలుంగులు నింగి ముట్టఁగన్.

95


వ.

భూలోకపాలనలాలసుం డగు త్రిదశపాలుండునుం బోలె నమ్మహీపాలుండు
వివిధవిభవశీలుం డగుచుఁ గక్ష్యంతరంబులు గడచి కొలువుకూటంబునకు
నరుగునవసరంబున నిద్దఱు భృత్యు లెదుర వచ్చి భయభ క్తియుక్తంబు లగు
చిత్తంబులు తలపడుచుండఁ బ్రణామంబు లాచరించి యిట్లని విన్నవించిరి.

96


క.

దేవర పెట్టిన చోటం
గావలి యుండుదు మొకించుకయు నాలస్యం
బేవంకను లేదు ధరి
త్రీవర! కడు మోసపోయితిమి విను నిన్నన్.

97


ఆ.

“ఏమి దైవికంబో యెఱుఁగ, మెవ్వారును
జోచ్చి వెళ్ళినట్టిచొప్పు లేదు;
పంచలోహమయవిభాసితం బగు మన
యనుఁగుమేడ పసిఁడి యయ్యె" ననిన.

98


క.

“వింటిమి మీచేఁ గ్రొత్తలు,
కంటిమె లోహంబు లెందుఁ గనక మగుట య
య్యింటికి నిట్టిమహిమ యెటు
వంటి మహాత్మకునిచేత వర్తిల్లె నొకో!"

99


వ.

అని పలుకుచుం దన మేనును బరిజనంబుల మేనులును గలయ నవలోకించి.

100


క.

పసుపున నానినవీరలు
ముసుఁగు పడినయట్లు దేహమునఁ బీతరుచుల్
పొసఁగినయవి కనకగృహము
పసిమియె కాకున్నె యని నృపతి వెఱఁ గందెన్.

101


వ.

ఇట్లు వెఱఁ గందుచుఁ బోయి సౌవర్ణగేహంబుఁ జూచి చోద్య మంది.

102