పుట:Bhaktirasashatak018555mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక
ఈ సూర్యనారాయణశతకమును వరాహవేంకటనృసింహకవి రచించెను. ఇతఁడు భారద్వాజగోత్రుఁడు, బ్రాహ్మణుఁడు. జగన్నాయకశతకము రచించి వరాహగిరి కొండరాజు నీతఁడు నేకగోత్రులే గాని యిరువురును తమ పూర్వులను జెప్పికొనకపోవుటచే నిందెవరు పూర్వలో యిరువురకుఁ గల సంబంధ మెట్టిదో యెఱుఁగ వీలుకాలేదు.
“శ్రితసంపత్సుమవల్లియౌ నరసవెల్లిన్” అను పద్యమువలనఁ గవి నరసవెల్లిలోని సూర్యనారాయణస్వామినిగూర్చి యీశతకము రచించెనని యూహింపనగును గాని *నరసవెల్లి యెచట నున్నదో కవి సంబంధు లెవరేని యటఁ గలరేమో తెలియవచ్చుట లేదు. తత్రత్యు లీవిషయమునఁ బ్రయత్నించి కవిజీవితము ప్రచురించుట యవసరము.

ఈసూర్యనారాయణశతకము భాష జటిలముగ సాంస్కృతికసమాసబంధురముగ నున్నది. కొన్నిచోటుల పద్యమునంతటి నాక్రమించుకొనిన సమాసములు గలవు. భావముల స్వతంత్రములై రమణీయములై యున్నవి. సూర్యభగవానుని తేజోవిభ

  • అరసవెల్లి శ్రీకాకుళం నగరానికి 11 కిమీ దూరంలో ఉంది. (proofreader's comment)