పుట:Bhagira Loya.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

స్వరూపంతో మూడు అంగల్లో గుమ్మం దాటి విసవిస వెడలి మాయమయ్యాడు.

14

ఆ నాటి సాయంత్రం మీనాక్షి మాయమయింది. రెండురోజు లైన వెనక బెంగుళూరులో మీనాక్షి, కామేశ్వర్రావులకు వివాహం అయిందని పత్రికలలో ప్రచురణం అయింది. చెన్నపట్టణంలో బెంగలుపెట్టుకుని తిండి మానేసుకున్న వీరయ్య జట్టుకు సీతారామయ్యగారు నెమ్మదిగా ఈ వార్త వినిపించాడు. విఠలుడిమోము ప్రపుల్లమైంది. వీరయ్య విషాదంతోనూ, కోపంతోనూ కూలబడిపోయాడు.

ఈ వార్త విని కామేశ్వర్రావు మేనమామ మహాగ్రహంతో కామేశ్వర్రావుని బండబూతులు తిట్టుకున్నాడు.

సీతారామయ్యగారూ, కామేశ్వర్రావు మేనమామా భీమవరం తిరిగి వెళ్ళిపోయారు.

ఒక రోజు తెల్లవారేసరికి వికసించిన గులాబిపువ్వు మోముతో మీనాక్షీదేవి తాతగారి దగ్గఱకు వచ్చి నమస్కారం చేసింది. ఆమె పెదవులు చిరునవ్వు నవ్వుతున్నవి. ఆమెకళ్లు చిరుభయంతో బెదరుతున్నవి. ఆమె ఫాలంలో ముంగురులు చిరుగాలిలో చెదురుతున్నవి. ఆమె వాక్కులు చిరుకంపంతో తొణుకులాడినవి.

"నీ మొహం చూడకూడదు, అమ్మిణీ!"

"............"

97