పుట:AntuVyadhulu.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవులెట్లు వ్యాధిని కలుగజేయును

65



నకును యుద్ధస్థలమునకు వచ్చుచుండును. వీనితోపాటు వీని కాహారపదార్థమగు రసియు, రక్తము మొదలగు నితర పదార్థములను హెచ్చుగ యుద్ధరంగమునకు వచ్చుచుండును. ఈ పదార్థములయొక్కయు సూక్ష్మజీవులయొక్కయు కూడికనే మనము వాపు అని చెప్పుచున్నాము. సూక్ష్మజీవులయొక్కయు తెల్ల కణములయొక్కయు మృత కళేబరములును యుద్ధము యొక్క ఉద్రేకముచేత నశింపయిన కండ రక్తము మొదలగు ఇతర శరీర భాగములను, రసియు, సూక్ష్మజీవులచే విసర్జింప బడిన విషయమును, బ్రతికియున్నకొన్ని తెల్లకణములును చేరి యేర్పడుదానినే మనము చీము అనిచెప్పుదుము. పటములో కొన్ని తెల్లకణములు సూక్ష్మజీవులను మ్రింగియున్నవి. 26-వ పటము చూడుము. సూక్ష్మజీవులు కోటాన కోట్లుగా పెరుగుచుండుటచేత రోగియొక్క శరీరబలము సూక్ష్మజీవుల బలము కంటే తక్కువగనున్నయెడల సూక్ష్మజీవులే జయమునొంది శరీరములోనికి చొచ్చుకొనిపోవును. శరీరబలము హెచ్చుగనుండి సూక్ష్మజీవుల బలము తక్కువగ నున్నయెడల సూక్ష్మజీవులు నశించిపోవును; లేదా, వెలుపలకు గెంటివేయబడును. ఇట్లు గెంటివేయబడుటచేతనే 25-వ పటములో చూపిన కురుపు చితికి చీము బయట బడుచున్నది. సూక్ష్మజీవులబలము తక్కువగ నున్నయెడల కురుపు లోలోపలకు పోవును. అట్టి సమయములో శస్త్రముచేసి చీము బయటకు వచ్చుటకు మార్గమేర్ప