పుట:AntuVyadhulu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయిదవ ప్రకరణము

అంతర్గతకాలము

పైనిచెప్పబడిన వివిధజాతుల సూక్ష్మజీవులు మనశరీరములో ప్రవేశించినవెంటనే వ్యాధి బయలుపడదని యిదివరలో సూచించియున్నాము. మనశరీరములో ప్రవేశించిన సూక్ష్మ జీవుల సంఖ్యమొదట మిక్కిలి తక్కువగనుండి అవి గంట గంటకు మనశరీరములో పెరిగి వందలువందలుగ పిల్లలనుపెట్టి తుదకు కొన్నిదినములలోనే లక్షలకొలది, కోట్లకొలది యగును. మనశరీరములో సూక్ష్మజీవులు ప్రవేశించినది మొదలు అంటువ్యాధియొక్క మొదటి చిహ్నము అగు జ్వరము, తల నొప్పి మొదలగునవి యెవ్వియైనను కనబడువరకు పట్టుకాలమునకు అంతర్గతకాలము (Incubation period) అని పేరు. దీనినే కొందరు ఉద్భూతకాలమనుచున్నారు. ఈ యంతర్గత కాలము కొన్నివ్యాధులలో మిక్కిలి తక్కువగ నుండును. మఱికొన్ని వ్యాధులలో పది లేక పదునైదు దినములుపట్టును. ఇది ఆ యాజాతి సూక్ష్మజీవులు పెరుగు పద్ధతినిబట్టియు, రోగి యొక్కబలాబలముబట్టియు, మారుచుండును. అంతర్గతకాలములో రోగికి ఫలాని వ్యాధిసోకినదని యెంతమాత్రము తెలియదని చెప్పపచ్చును. ఒక్కొక్కవ్యాధియొక్క అంతర్గతకాలము తెలిసికొనుటలో అనేక సందిగ్ధాంశములు గలవు.

౧. ఏ దినమున సూక్ష్మజీవులు శరీరములో ప్రవేశించినవో చెప్పుట కన్నిసమయములందును వీలుండదు. ఒకానొక