పుట:AntuVyadhulu.djvu/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

217

షాంగముల నుండి స్రవించు ద్రవముల యందును చనుబాల యందును సూక్ష్మ జీవులుండును. ఒక కుష్ఠ రోగి రెండు నిముషములు బిగ్గరగ మాట్లాడినంతలో నలబై వేలు మొదలు 185 వేల సూక్ష్మ జీవుల వరకు గజము దూరము దాక వెదజిమ్మునని యెక శాస్త్ర కారుడు లెక్కించి యున్నాడు. ఈ రోగులు ముక్కులందు 110 లో 92 మందికి పుండు ఉండునని శోధకులు వ్రాసి యున్నారు. కాబట్టి కుష్ఠ రోగులుల నెన్నటీకిని దరి జేర దీయ కూడదు. కుష్ఠ రోగులు వివాహ మాడ కూడదని నిర్బందములు ఏర్పడవలయును. వారలకు తగు ఆశ్రమములు నిర్మించి అక్కడనే వారి సౌఖ్యములకు తగిన ఏర్పాట్లు జేసి యావజ్జీవము గడుపు నట్లు చేయ వలయిను. లేని చో మన దేశమున ఈ మహా వ్యాధి ఎన్నడును విడువదని చెప్ప వచ్చును. కుష్ఠ రోగులను తాక వలసి వచ్చిన వారెల్లరును ఎప్పటి కప్పుడు తమ చేతులను మిక్కిలి శ్రద్ధగా మందు నీళ్లల్తో కడికి కొనవలయును. వ్యాధిని దాచ కుండుట, తగిన అధికారులు ఇంటింటిని శోధించి వ్యాధి గ్రస్తుల గూర్చి ప్రకటన చేయుట, రోగులను ప్రత్యేక పరచుట, పరి శుభ్రతను వృద్ధి పరచు ఆచారముల నవలంబించుట, ఇవియే కుష్ఠ వ్యాధిని నిర్మూలము చేయుటకు ముఖ్య సాధనములు.

పచ్చసెగ-కొరుకు-అడ్డగర్రలు

(Gonorrhea-Syphilis-Bubo)

ఇవి వ్యభిచరించు స్త్రీ పురుషులకు మిక్కిలి తరచుగ అంటు వ్వాధులు. వీనినే సుఖ వ్యాధులు అందురు. ఇందు మొదటి