పుట:AntuVyadhulu.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

పండ్రెండవ ప్రకరణము


వేలకొలది జనులు వచ్చుచు పోవుచున్నను వ్యాధులు మాత్రము దేశములో ప్రవేశింపనేరవు. ఇట్లే నాగరకత జెందిన అన్నిదేశములవారును తమ దేశములోనికి క్రొత్తవ్యాధులెవ్వియును ప్రవేశింపకుండ నిరంతరం ఫారాయుంచి తమ దేశమును కాపాడుకొనుచున్నారు. మన సంగతి ఎట్లున్నదన క్రొత్తవ్యాధులు వచ్చునవి వచ్చుచుండగా నిదివరకే మనదేశము నాశ్రయించియున్న చలిజ్వరము, కలరా, ప్లేగు , క్షయ కుష్ఠము మొదలగు వ్యాధులు ఒక్కొక్క సంవత్సరమునకును హెచ్చుచున్నవి. వీనిని నివారించుటకు ముఖ్యమైన పద్ధతులు మూడుగలవు.

i. ప్రకటన చేయుట (Notification). అనగా అంటువ్యాధి గ్రామములో ప్రవేశించిన తోడనే దానిం దాచి పెట్టక తక్షణమే సర్కారు ఉద్యోగస్థులకును, తరువాత సర్వ జనులకును బహిరంగపరచవలెను.

ii. ప్రత్యేకపరుచుట (Isolation). అనగా రోగినుండి యితరుల కా వ్యాధి అంటకుండ రోగిని ప్రత్యేక స్థలమందుంచుట. అనుమానాస్పదమగు ప్రదేశములయందుండి వచ్చు ప్రయాణికులను బలవంతపు మకాములలో (Quarantine) నుంచుటయు నిందులోజేరును.

iii. సూక్ష్మజీవుల సంహరించుట (Attacking Micorbes).